మౌలికవసతులు కల్పించకుండా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం దోపిడీ కాదా?
జిల్లా కేంద్రాలు, వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో కనీస మౌలికవసతులు కల్పించకుండా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం ప్రజల్ని దోచుకోవడం కాదా? అని తెదేపా అధికార ప్రతినిధి నసీర్ అహ్మద్ ప్రశ్నించారు.
తెదేపా అధికార ప్రతినిధి నసీర్ అహ్మద్
ఈనాడు డిజిటల్, అమరావతి : జిల్లా కేంద్రాలు, వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో కనీస మౌలికవసతులు కల్పించకుండా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం ప్రజల్ని దోచుకోవడం కాదా? అని తెదేపా అధికార ప్రతినిధి నసీర్ అహ్మద్ ప్రశ్నించారు. గ్రామాల్లో భూముల విలువ, ఆఖరికి పూడిగుడిసెలపై కూడా పన్ను పెంచడం పేద, మధ్యతరగతి వర్గాల నడ్డివిరచడమేనని మండిపడ్డారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ఏ ప్రాంతంలో అయినా ప్రభుత్వం మౌలిక వసతులు కల్పిస్తే.. అక్కడ భూములు, ఆస్తుల ధరలు పెరుగుతాయి. ఈ ప్రభుత్వం ఆదాయంపై చూపుతున్న శ్రద్ధలో సగం కూడా మౌలికవసతుల కల్పనలో చూపడం లేదు. జగన్ పాలనలో ఇప్పటికే రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం పూర్తిగా కుదేలయ్యాయి. అభివృద్ధి పథంలో నడపాల్సిన ప్రభుత్వం రాష్ట్రాన్ని అథోగతి పాలు చేయడం బాధాకరం...’’ అని నసీర్ అహ్మద్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక