మౌలికవసతులు కల్పించకుండా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం దోపిడీ కాదా?
జిల్లా కేంద్రాలు, వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో కనీస మౌలికవసతులు కల్పించకుండా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం ప్రజల్ని దోచుకోవడం కాదా? అని తెదేపా అధికార ప్రతినిధి నసీర్ అహ్మద్ ప్రశ్నించారు.
తెదేపా అధికార ప్రతినిధి నసీర్ అహ్మద్
ఈనాడు డిజిటల్, అమరావతి : జిల్లా కేంద్రాలు, వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో కనీస మౌలికవసతులు కల్పించకుండా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం ప్రజల్ని దోచుకోవడం కాదా? అని తెదేపా అధికార ప్రతినిధి నసీర్ అహ్మద్ ప్రశ్నించారు. గ్రామాల్లో భూముల విలువ, ఆఖరికి పూడిగుడిసెలపై కూడా పన్ను పెంచడం పేద, మధ్యతరగతి వర్గాల నడ్డివిరచడమేనని మండిపడ్డారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ఏ ప్రాంతంలో అయినా ప్రభుత్వం మౌలిక వసతులు కల్పిస్తే.. అక్కడ భూములు, ఆస్తుల ధరలు పెరుగుతాయి. ఈ ప్రభుత్వం ఆదాయంపై చూపుతున్న శ్రద్ధలో సగం కూడా మౌలికవసతుల కల్పనలో చూపడం లేదు. జగన్ పాలనలో ఇప్పటికే రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం పూర్తిగా కుదేలయ్యాయి. అభివృద్ధి పథంలో నడపాల్సిన ప్రభుత్వం రాష్ట్రాన్ని అథోగతి పాలు చేయడం బాధాకరం...’’ అని నసీర్ అహ్మద్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Motkupalli Narasimhulu : జైలులో చంద్రబాబుకు ఏదైనా జరిగితే జగన్దే బాధ్యత : మోత్కుపల్లి
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Chandrababu : క్వాష్ పిటిషన్పై హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో సవాల్ చేసిన చంద్రబాబు
-
Narendra Modi: శివతత్వం ప్రతిబింబించేలా వారణాసి క్రికెట్ స్టేడియం..
-
Crime News: కుమారుడిని చంపి.. ఇంటి ముందు పడేసి: ‘మీ సింహమిదిగో’ అంటూ హేళన
-
Nani: అప్పుడే మొదటి సారి ప్రేమలో పడ్డా.. ప్రస్తుతం తనే నా క్రష్: నాని