వైకాపాలో చేరిన తెదేపా నేత రామచంద్రరావు

విశాఖపట్నానికి చెందిన తెదేపా నేత గంపల వెంకట రామచంద్రరావు, ఆయన భార్య సంధ్యారాణి వైకాపాలో చేరారు. సోమవారం వారు తాడేపల్లిలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు.

Published : 19 Mar 2024 04:51 IST

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్‌

ఈనాడు, అమరావతి: విశాఖపట్నానికి చెందిన తెదేపా నేత గంపల వెంకట రామచంద్రరావు, ఆయన భార్య సంధ్యారాణి వైకాపాలో చేరారు. సోమవారం వారు తాడేపల్లిలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు. ఆయన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రామచంద్రరావు గతంలో విశాఖ దక్షిణ, తూర్పు నియోజకవర్గాల్లో తెదేపా ఎన్నికల బాధ్యుడిగా పనిచేశారు. గతంలో ప్రజారాజ్యం పార్టీలో పనిచేసి ప్రస్తుతం సేవా కార్యక్రమాల్లో ఉన్న అచ్యుతరావు కూడా వైకాపాలో చేరారు. వైకాపా విశాఖ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, విశాఖ ఆకర్షణీయ నగర సంస్థ మాజీ ఛైర్మన్‌ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని