ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయలేని అసమర్థ సీఎం జగన్
జగన్రెడ్డి అయిదేళ్ల పాలనలో జలవనరుల రంగంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండా రైతులకు కన్నీరు మిగిల్చారని జలవనరుల శాఖ మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు.
జలవనరుల రంగానికి తెదేపా హయాంలో చేసిన ఖర్చు రూ.68,293 కోట్లు
జగన్ అయిదేళ్ల పాలనలో చేసిన వ్యయం రూ.35,268 కోట్లే
మాజీ మంత్రి దేవినేని ఉమా ధ్వజం
ఈనాడు, అమరావతి: జగన్రెడ్డి అయిదేళ్ల పాలనలో జలవనరుల రంగంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండా రైతులకు కన్నీరు మిగిల్చారని జలవనరుల శాఖ మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. మంగళగిరిలోని కేంద్ర తెదేపా కార్యాలయంలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘తెదేపా హయాంలో అయిదేళ్లలో రూ.68,293 కోట్లు ఖర్చు చేసి 23 ప్రాజెక్టులు పూర్తి చేశాం. 62 ప్రాజెక్టుల పనులను పరుగులెత్తించాం. ఏ ప్రాజెక్టులో ఏ స్థాయిలో పనులు అయ్యాయో పుస్తకం వేసి ప్రజలకు సమాచారం అందించాం. కానీ జగన్ వచ్చాక జలవనరుల రంగాన్ని నిర్వీర్యం చేశారు. రైతు కన్నీరు పెట్టకూడదని ప్రతి ఎకరానికీ నీళ్లందించేందుకు చంద్రబాబు కృషి చేశారు. జగన్రెడ్డి మూర్ఖత్వం, నిర్లక్ష్యం, దోపిడీ కారణంగా పోలవరం ప్రాజెక్టు నాశనమైంది. తెదేపా అధికారంలోకి రాక ముందు కాలువల మట్టి పనులకే పరిమితం చేశారు. 5 శాతం పనులూ పూర్తి కాలేదు. ఏడు ముంపు మండలాల నిర్వాసితుల డబ్బులు తినేశారు. తెదేపా అధికారంలోకి వచ్చాక నిర్వాసితులకు రూ.115 కోట్ల పరిహారం చెల్లించి.. కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఒప్పించి ప్రాజెక్టు త్వరగా చేయడానికి చర్యలు తీసుకుంది. 72% పనులు పూర్తి చేశాం. దాదాపు రూ.11,923 కోట్లు ఖర్చు చేశాం. జగన్ అయిదేళ్ల పాలనలో రూ.5,825 కోట్లు పనులే చేశారు. డయాఫ్రం వాల్ పనులు ఉద్దేశపూర్వకంగా దెబ్బతీశారు. మొదటి జలవనరులశాఖ మంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ బుల్లెట్ దిగిందా అని అహంకారపూరితంగా మాట్లాడారు. రెండో మంత్రి పోలవరం అంటే చేతులెత్తేసి, డ్యాన్సులు చేస్తున్నారు. సీఎం జగన్, ఇద్దరు మంత్రులూ కలిసి పోలవరాన్ని ముంచేసి జాతికి ద్రోహం చేశారు’ అని మాజీ మంత్రి దేవినేని మండిపడ్డారు. ‘కరవు బారినపడే రాయలసీమను కాపాడాలని హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగ, ముచ్చుమర్రి, పట్టిసీమ వంటి ప్రాజెక్టుల పనులు పరుగులెత్తించాం. వాటినీ జగన్రెడ్డి నిర్వీర్యం చేశారు. పక్క రాష్ట్రంలో తనకు సంబంధించిన వ్యక్తిని గెలిపించుకోవాలన్న ఉద్దేశంతో సీమకు వెళ్లాల్సిన నీటిని పొరుగు రాష్ట్రానికి ఇచ్చిన తెలివితక్కువ సీఎం జగన్రెడ్డి’ అని దేవినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు -
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం