నకిలీ వార్తను నమ్మొద్దు: పురందేశ్వరి
‘ముస్లిం రిజర్వేషన్లపై నేను మాట్లాడినట్లుగా నకిలీ (ఫేక్) వార్తను సామాజిక మాధ్యమాల్లో పెట్టి, ప్రచారం చేస్తున్నారు. ఆ వార్తను నమ్మొద్దు’ అని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తెలిపారు.
ఈనాడు, అమరావతి: ‘ముస్లిం రిజర్వేషన్లపై నేను మాట్లాడినట్లుగా నకిలీ (ఫేక్) వార్తను సామాజిక మాధ్యమాల్లో పెట్టి, ప్రచారం చేస్తున్నారు. ఆ వార్తను నమ్మొద్దు’ అని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తెలిపారు. ‘‘సబ్కా సాథ్ సబ్కా వికాస్’ భాజపా నినాదం. అంటే సమాజంలోని అందరినీ కలుపుకొని అందరినీ అభివృద్ధి వైపు నడిపించడమే భాజపా అభిమతం. ఇందుకు భిన్నంగా ట్రోల్ అవుతున్న ఆ నకిలీ వార్తను నమ్మొద్దని ముస్లిం సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా’ అని రాష్ట్ర కార్యాలయం నుంచి మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పురందేశ్వరి పేర్కొన్నారు. ఇదే విషయమై రాష్ట్ర భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విడుదల చేసిన మరో ప్రకటనలో ‘రాజమండ్రి లోక్సభ ఎన్నికల్లో పురందేశ్వరికి లభిస్తున్న ప్రజాదరణ చూసి, ఓర్వలేక వైకాపా పెయిడ్ ఆర్టిస్టులతో సామాజిక మాధ్యమాల్లో ఆమె అనని వ్యాఖ్యలను అన్నట్లు ప్రచారం చేస్తున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
లోక్సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. -
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
ఐదేళ్ల జగన్ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
4 నెలలకే ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా.. 10% మంది ఉద్యోగులకు ఉద్వాసన!
-
ప్రధానిగా రాహుల్ ప్రమాణం.. ఏఐ క్లిప్ వైరల్
-
ఇజ్రాయెల్ అధికారుల్లో.. ‘ఐసీసీ’ అరెస్టు వారెంట్ల గుబులు!
-
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
-
ఏటీఎం చోరీకి యత్నం.. షార్ట్ సర్క్యూట్తో నగదు దగ్ధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM