కాంగ్రెస్ ‘గ్యారంటీ కార్డు’ల ప్రచారాన్ని అడ్డుకోండి
‘ఇంటింటికీ (ఘర్ఘర్) గ్యారంటీ’ పేరుతో కాంగ్రెస్ ఇస్తున్న హామీలు అవినీతి చర్యల కిందికే వస్తాయని, దానిని వెంటనే అడ్డుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది.
ఈసీకి భాజపా వినతి
దిల్లీ: ‘ఇంటింటికీ (ఘర్ఘర్) గ్యారంటీ’ పేరుతో కాంగ్రెస్ ఇస్తున్న హామీలు అవినీతి చర్యల కిందికే వస్తాయని, దానిని వెంటనే అడ్డుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. ‘కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ నెల 3న గ్యారంటీ కార్డుల్ని ఇంటింటికీ పంపిణీ చేయడం ప్రారంభించారు. తాము చెబుతున్న లబ్ధిని పొందేందుకు దరఖాస్తులను ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. అధికార ఆమోదం ఉందని చెప్పేలా ఖర్గే, రాహుల్గాంధీల హామీ సంతకాలు వీటిపై ఉంటున్నాయి. చట్టబద్ధమైన సాధనాలుగా గ్యారంటీ కార్డుల్ని చూపిస్తున్నారు. ఇది ఓటర్ల విశ్వాసాన్ని తారుమారు చేసే ప్రయత్నం. దీనిని అనుమతించడమంటే స్వేచ్ఛ, నిష్పాక్షిక ఎన్నికల సూత్రాలకు విరుద్ధం. కార్డులను పంపిణీ చేస్తున్నవారిపై కేసులు నమోదు చేయించండి’ అని
వినతి పత్రంలో విజ్ఞప్తి చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మండిపడ్డారు. -
ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొస్తాం: కర్ణాటక హోంమంత్రి
Prajwal Revanna: కర్ణాటక రాజకీయాల్లో సంచలనంగా మారిన లైంగిక దౌర్జన్యం కేసులో ప్రధాన నిందితుడైన ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొచ్చేందుకు సిట్ చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర హోంమంత్రి వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజల ఆస్తులకు ముప్పు: జీవీ రెడ్డి
ప్రజల ఆస్తులు దోచుకోవడానికే వైకాపా ప్రభుత్వం.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిందని తెదేపా అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ధ్వజమెత్తారు. -
నెలకు రూ.9 వేల కోట్ల సంపద సృష్టించలేక అప్పులపాలు
ప్రతి నెల రూ.9 వేల కోట్ల సంపద సృష్టించడం చేతకాని సీఎం జగన్.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
జగన్ను ఎందుకు అరెస్టు చేయరు?
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై కక్ష గట్టి అరెస్టు చేయించిన కేంద్రంలోని భాజపా ప్రభుత్వం.. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి ఎందుకు మినహాయింపు ఇస్తోందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, మాజీ రాజ్యసభ సభ్యులు పి.మధు ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
షారుక్ విమానం కోరిక.. కమల్ హాసన్ ఫన్నీ కామెంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అభ్యంతరకర వీడియోల ఘటన.. ఎంపీ ప్రజ్వల్పై సస్పెన్షన్ వేటు
-
సోనీ రియాన్ పాకెట్ ఏసీ.. ఎక్కడికైనా వెంట తీసుకెళ్లొచ్చు!
-
విజయవాడలో విషాదం.. ప్రముఖ వైద్యుడు సహా ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి
-
భారత్ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ నేత