వివేకా హత్యలో జగన్‌, భారతిల ప్రమేయం

ఏపీ మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన భార్య భారతి ప్రమేయం ఉందనడంలో తనకు ఎలాంటి సందేహం లేదని నరసాపురం ఎంపీ, తెదేపా నేత కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.

Published : 17 Apr 2024 04:39 IST

ఎంపీ రఘురామ

భీమవరం పట్టణం, కాళ్ల, న్యూస్‌టుడే: ఏపీ మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన భార్య భారతి ప్రమేయం ఉందనడంలో తనకు ఎలాంటి సందేహం లేదని నరసాపురం ఎంపీ, తెదేపా నేత కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. భీమవరంలోని తన నివాసంలో మంగళవారం నిర్వహించిన ‘రచ్చబండ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వివేకా కుమార్తె డాక్టర్‌ సునీత తాజా విలేకర్ల సమావేశంలో చెప్పిన నిజం ఇదేనని తాను భావిస్తున్నానన్నారు. ఈ కేసులో సీబీఐ విచారణ పూర్తయితే ప్రస్తుతానికి సూత్రధారిగా భావిస్తున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి పాత్రధారిగా మారతారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని