నామినేషన్లకు వేళాయె..
రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం నోటిఫికేషన్ జారీ చేయనుంది.
ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరణ
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం నోటిఫికేషన్ జారీ చేయనుంది. గురువారం నుంచి ఈ నెల 25 వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయా నియోజకవర్గాల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. ఆదివారం మాత్రం స్వీకరించరు. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 స్థానాలకు 645 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా.. తుది పోరులో 443 మంది నిలిచారు.
30న తుది ఓటర్ల జాబితా
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో నాలుగో దశలో పోలింగ్ నిర్వహించేందుకు ఈసీ నిర్ణయించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 3,30,21,735 మంది ఓటర్లు ఉన్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించింది. ఈ నెల 15వ తేదీ వరకు ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఫిబ్రవరి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు అందిన దరఖాస్తుల్లో అర్హులకు ఈ నెల 30వ తేదీలోగా ఓటుహక్కు కల్పించనున్నారు. అదేరోజు రూపొందించిన ఓటర్ల జాబితానే పోలింగ్కు ప్రామాణికంగా తీసుకుంటారు.
భారీ బందోబస్తు..
ఎన్నికల సందర్భంగా భారీగా పోలీసు బలగాలను మోహరించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. తెలంగాణకు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో సరిహద్దులు ఉన్న నేపథ్యంలో నిఘాను విస్తృతం చేశారు. తాజాగా ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ నేపథ్యంలో పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. ఎన్నికల బందోబస్తు కోసం సుమారు 60 వేల మంది సిబ్బందిని వినియోగించాలని ఈసీ నిర్ణయించింది. సుమారు 75 నుంచి 100 కంపెనీల వరకు కేంద్ర సాయుధ బలగాలను రాష్ట్రానికి పంపేందుకు కసరత్తు చేస్తోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని, లోక్సభ ఎన్నికలనూ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఉన్నతాధికారి ఒకరు బుధవారం ‘ఈనాడు’కు తెలిపారు.
35,666 పోలింగ్ కేంద్రాలు
రాష్ట్రంలో 35,666 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అవసరమైన ప్రాంతాల్లో అదనంగా సహాయక పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు సైతం ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బృందం అన్ని ఏర్పాట్లు చేసింది. డబ్బు ప్రభావాన్ని నియంత్రించేందుకు విస్తృత నిఘా పెట్టింది. ఇప్పటివరకు సుమారు రూ.130 కోట్ల విలువ చేసే నగదు, మద్యం, వివిధ రకాల వస్తువులను స్వాధీనం చేసుకుంది. ఎన్నికల పర్యవేక్షణకు వివిధ రాష్ట్రాలకు చెందిన 49 మంది సీనియర్ అధికారులను పరిశీలకులుగా ఈసీ నియమించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మండిపడ్డారు. -
ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొస్తాం: కర్ణాటక హోంమంత్రి
Prajwal Revanna: కర్ణాటక రాజకీయాల్లో సంచలనంగా మారిన లైంగిక దౌర్జన్యం కేసులో ప్రధాన నిందితుడైన ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొచ్చేందుకు సిట్ చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర హోంమంత్రి వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజల ఆస్తులకు ముప్పు: జీవీ రెడ్డి
ప్రజల ఆస్తులు దోచుకోవడానికే వైకాపా ప్రభుత్వం.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిందని తెదేపా అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ధ్వజమెత్తారు. -
నెలకు రూ.9 వేల కోట్ల సంపద సృష్టించలేక అప్పులపాలు
ప్రతి నెల రూ.9 వేల కోట్ల సంపద సృష్టించడం చేతకాని సీఎం జగన్.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
జగన్ను ఎందుకు అరెస్టు చేయరు?
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై కక్ష గట్టి అరెస్టు చేయించిన కేంద్రంలోని భాజపా ప్రభుత్వం.. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి ఎందుకు మినహాయింపు ఇస్తోందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, మాజీ రాజ్యసభ సభ్యులు పి.మధు ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
-
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
-
‘పాకిస్థాన్కు చెప్పిన తర్వాతే..’: బాలాకోట్ దాడులపై మోదీ కీలక వ్యాఖ్యలు
-
నేను చేయను.. నీకేమైనా ఇబ్బందా?: నెటిజన్కు హీరోయిన్ ఘాటు రిప్లై
-
ఐసీయూలో పనిచేయని ఏసీలు