గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన ఎంఐఎం

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అక్కడి రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఎన్నికల్లో పోటీ చేస్తామని ఇదివరకే స్పష్టం చేసిన ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌

Published : 26 Sep 2022 04:49 IST

గాంధీనగర్‌: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అక్కడి రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఎన్నికల్లో పోటీ చేస్తామని ఇదివరకే స్పష్టం చేసిన ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ..తాజాగా మరో అడుగు ముందుకేశారు. ముగ్గురు అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. జమల్‌పుర్‌ నుంచి ఎంఐఎం గుజరాత్‌ రాష్ట్ర అధ్యక్షుడు సబీర్‌ కబ్లీవాలా బరిలోకి దిగుతారని ప్రకటించారు. దానిలిమ్‌డా అసెంబ్లీ నుంచి కౌశికాపార్మర్‌, తూర్పు సూరత్‌ నియోజక వర్గం నుంచి వాసిమ్‌ ఖురేషి పోటీ చేస్తారని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని