తెరాసను తరిమేద్దాం.. భాజపాను తీసుకొద్దాం
రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో తరిమి కొట్టి పేదల రాజ్యం తీసుకొద్దామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
ఒక్క ముంపుగ్రామాన్ని పట్టించుకోని సీఎం రాష్ట్రాన్ని ఏం కాపాడతారు?
ప్రజా సంగ్రామ యాత్రలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
నిర్మల్, భైంసా పట్టణం, న్యూస్టుడే: రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో తరిమి కొట్టి పేదల రాజ్యం తీసుకొద్దామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రజా సంగ్రామయాత్ర బుధవారం నిర్మల్ జిల్లా భైంసా శివారు నుంచి వాడిపెల్లి క్రాస్రోడ్, గుండేగాం, మహాగాం, మహాగాం తండా, చాత మీదుగా లింబా-బి వరకు సాగింది. పల్సి రంగారావు జలాశయ ముంపు గ్రామమైన గుండేగాంలో సంజయ్ రచ్చబండ నిర్వహించి మాట్లాడారు. రాత్రి భైంసా మండలం మహాగాంలో బుధవారం రాత్రి జరిగిన సభలోనూ ప్రసంగించారు. గుండేగాంలో ముంపు బాధితులు తమ గోడు వెల్లడించగా.. ‘మీ పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది.. ఊరు మునిగిపోతున్నా సీఎం కేసీఆర్ ఎందుకు పట్టించుకోవడం లేదు? 250 కుటుంబాలను ఆదుకోని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఎలా కాపాడతారు? వానొస్తే తెరాస నేతలను ఇక్కడికి తీసుకొచ్చి కట్టేయండి.. అప్పుడే వారికి మీ బాధ తెలుస్తుంది. ఏడేళ్లుగా మీ బాధలు పట్టించుకోని ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యే మీకు అవసరమా?’ అని ప్రశ్నించారు. తాము వస్తున్నామని తెలిసి గ్రామంలో సర్వే చేశారని, జీవో మంజూరు కాగితాలు, చెక్కులు ఇచ్చి చప్పట్లు కొట్టించుకుని మళ్లీ కనిపించకుండా పోతారని అన్నారు. ఇక్కడ ముంపు పరిహారం చెల్లించలేని కేసీఆర్ పంజాబ్ వెళ్లి ఒక్కో రైతుకు రూ.3 లక్షలు ఇచ్చారని గుర్తు చేశారు. చింతమడకలో ఇంటింటికీ రూ.10 లక్షలు ఇచ్చిన సీఎం గుండేగాం వాసుల కష్టాలు తీర్చకపోవడం బాధగా ఉందన్నారు. కేసీఆర్కు పేదలంటే మంట అని, కేసులు పెట్టి వేధిస్తూనే ఉంటారన్నారు. తాము పేదల వెంటే ఉంటామని జైళ్లు, పోలీసుల దెబ్బలు కొత్తకాదని అన్నారు. రాబోయే రోజుల్లో భాజపా అధికారంలో వస్తుందని, ఆ తర్వాత ఆయన సంగతి చూస్తామన్నారు.
ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలివ్వాలి
స్థలం ఉన్న వాళ్లందరికీ ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామంటూ అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చిన కేసీఆర్ మాట తప్పి రూ.3 లక్షలే ఇస్తామంటున్నారని బండి సంజయ్ మహాగాం సభలో అన్నారు. స్థలం ఉన్న వారందరికీ డబ్బులిచ్చే వరకు వదలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాలకు కేంద్రం రూ.4 వేల కోట్లకుపైగా నిధులిస్తే.. ఆ సొమ్మును కేసీఆర్ దారి మళ్లించారని ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..