BJP Vs AAP : మోదీకి జన్మనివ్వడమే ఆమె చేసిన నేరమా!: స్మృతి ఇరానీ
ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ను ఆప్ నేత గోపాల్ ఇటాలియా వెక్కిరించారని ఆరోపిస్తూ భారతీయ జనతా పార్టీ తీవ్రంగా మండిపడింది.
దిల్లీ: గుజరాత్ అసెంబ్లీ (Gujarat Assembly) ఎన్నికలకు సమయం దగ్గరపడుతోన్న వేళ.. భాజపా, ఆమ్ఆద్మీ పార్టీ నడుమ మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆమ్ఆద్మీపార్టీ గుజరాత్ చీఫ్ గోపాల్ ఇటాలియాకు (Gopal Italia) సంబంధించినట్లుగా చెబుతోన్న ఓ వీడియో ఇందుకు తాజాగా వేదికయ్యింది. ప్రధాని మోదీని (Narendra Modi) మాతృమూర్తిని ఆప్ నేత ఇటాలియా వెక్కిరించారని ఆరోపిస్తూ భారతీయ జనతా పార్టీ తీవ్రంగా మండిపడింది. ఇందుకు వచ్చే ఎన్నికల్లో గుజరాతీయుల నుంచి ఆమ్ఆద్మీ పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదని దుయ్యబట్టింది.
‘ఆమె చేసిన ఏకైక నేరం.. మీ (కేజ్రీవాల్) రాజకీయ నమూనాలను అడ్డుకునే నరేంద్ర మోదీకి జన్మనివ్వడమే. ప్రధానమంత్రి మాతృమూర్తిని అవమానించడం వల్ల రాజకీయంగా గుజరాత్లో పాపులారిటీ వస్తుందనుకుంటే పొరపాటే. అందుకు వచ్చే ఎన్నికల్లో మీరు మూల్యం చెల్లించుకునేలా ఓటర్లు చేస్తారు’ అని ఆమ్ఆద్మీ పార్టీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) మండిపడ్డారు. దిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆమె.. కేజ్రీవాల్ సూచనల ప్రకారమే ఇటాలియా అటువంటి వ్యాఖ్యలు చేశారని, ఇది మహిళలను అవమాన పరచడమేనని స్మృతి ఇరానీ పేర్కొన్నారు.
రాజకీయాలకు సంబంధం లేని ఓ వందేళ్ల వృద్ధురాలిని కించపరచడం క్షమించరానిదన్న స్మృతి ఇరానీ.. పటీదార్ వర్గానికి చెందిన వ్యక్తిని కావడం వల్లే నన్ను భాజపా లక్ష్యంగా చేసుకుందని గోపాల్ ఇటాలియా చెప్పడాన్ని తప్పుపట్టారు. వారి రాజకీయ ముగింపునకే వర్గం, లింగం వంటి కార్డులను ఆమ్ఆద్మీ పార్టీ వాడుతోందని దుయ్యబట్టారు. కేవలం కేజ్రీవాల్ ఆశీస్సులతోనే ప్రధాని తల్లిపై గోపాల్ ఇటాలియా ఇటువంటి వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.
ఇదిలాఉంటే, ప్రధానిమంత్రిపై గోపాల్ ఇటాలియా చేసిన వ్యాఖ్యలు అసభ్యంగా, స్త్రీలను ద్వేషించేలా ఉన్నాయంటూ జాతీయ మహిళా కమిషన్ ఆయనకు ఇటీవల సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అక్టోబర్ 13న ఎన్సీడబ్ల్యూ ముందు గోపాల్ ఇటాలియా హాజరయ్యారు. అదే సమయంలో ఎన్సీడబ్ల్యూ కార్యాలయం ముందు ఆప్ కార్యకర్తలు ఆందోళన చేపట్టడంతో గోపాల్ను దిల్లీ పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. దాదాపు మూడు గంటల తర్వాత ఆయన్ను విడిచిపెట్టారు. ఈ నేపథ్యంలోనే భాజపా, ఆప్ మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలయ్యింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్