Harish Rao: భాజపాలో ఎవరూ చేరేలా లేరని ఈటలకు అర్థమైంది: హరీశ్‌రావు

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు భాజపాలో చేరడం కష్టమేనని ఆ పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ అభిప్రాయపడిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా మంత్రి హరీశ్‌రావు స్పందించారు.

Published : 30 May 2023 21:56 IST

హైదరాబాద్‌: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు భాజపాలో చేరడం కష్టమేనని ఆ పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ అభిప్రాయపడిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా మంత్రి హరీశ్‌రావు స్పందించారు. ‘‘భాజపా చేరికల కమిటీ ఛైర్మన్‌ చేతులెత్తేశారు. భాజపాలో ఎవరూ చేరేలా లేరని ఈటల రాజేందర్‌కు అర్థమైంది. భారాస అంటే భాజపా, కాంగ్రెస్‌ పార్టీలకు కలవరం. కాంగ్రెస్‌ వాళ్లు పదవుల కోసం పాకులాడే వాళ్లు. దిల్లీలో ఉండే రాహుల్‌, మోదీకి పాలమూరు మీద ప్రేమ ఉంటుందా?’’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని