MVA: మహారాష్ట్ర ప్రభుత్వ మనుగడ ఎన్నాళ్లు?
మహారాష్ట్రలో ‘మహా వికాస్ ఆఘాడీ(ఎంవీఏ)’ ప్రభుత్వ మనుగడపై రోజురోజుకీ కొత్త ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. కూటమి పక్షాల మధ్య ముసలం ప్రారంభమైందన్న వాదన ముంబయి వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది....
తెరపైకి వస్తున్న అనేక ఊహాగానాలు
ముంబయి: మహారాష్ట్రలో ‘మహా వికాస్ ఆఘాడీ(ఎంవీఏ)’ ప్రభుత్వ మనుగడపై రోజురోజుకీ కొత్త ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. కూటమి పక్షాల మధ్య ముసలం ప్రారంభమైందన్న వాదన ముంబయి వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. అందులో భాగంగానే ఇటీవల ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే భాగస్వామ్య పక్షాలనుద్దేశించి కఠిన వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే, కూటమిలోని కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ ఐక్యంగానే ఉన్నాయని శివసేన కీలక నేత, ఎంపీ సంజయ్ రౌత్ సోమవారం తెలిపారు. తమ ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాలనా కాలాన్ని పూర్తి చేసుకొని తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న బయటి వ్యక్తులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంవీఏ సర్కార్ కొనసాగి తీరుతుందన్నారు. భాగస్వామ్య పక్షాల మధ్య బంధాన్ని తుంచేందుకు కొందరు ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయని.. కానీ, అవేవీ ఫలించవన్నారు.
మరోవైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని.. మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నానా పటోలే ఇటీవల వ్యాఖ్యానించారు. అయితే, తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ హామీ మేరకు ప్రస్తుతం ఉన్న ఎంవీఏ ప్రభుత్వం ఐదేళ్ల పాటు కొనసాగి తీరుతుందన్నారు. మరోవైపు రానున్న బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని సోమవారం పార్టీ నగర చీఫ్ భాయ్ జగతాప్ స్పష్టం చేశారు.
పటోలే వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించిన ఉద్ధవ్ ఠాక్రే.. ‘‘సమస్యలకు పరిష్కారం చూపకుండా కేవలం ఒంటరిగా పోటీ చేయడంపైనే మాట్లాడితే.. ప్రజలు చెప్పుతో కొడతారు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆయన ఎక్కడా కాంగ్రెస్ పేరుగానీ, పటోలే పేరుగానీ ఎత్తలేదు. శివసేనకు అధికార వ్యామోహం లేదని.. అనవసరంగా ఎవరినీ తాము భరించబోమని వ్యాఖ్యానించారు. అవసరమైతే తామూ పొత్తు లేకుండా ఎన్నికలకు వెళదామని పిలుపు ఇవ్వగలమన్నారు.
మరోవైపు ఇటీవల ఉద్ధవ్ ఠాక్రే ప్రధాని మోదీతో భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే, ఈ సమావేశంలో కేవలం వారివురు నేతలు మాత్రమే ఉన్నారు. మోదీతో తాను ఒక్కడినే మాట్లాడాలనుకుంటున్నానని ఉద్ధవ్ కోరినట్లు దిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ తర్వాత ఆయన మోదీతో సత్సంబంధాలు ఉన్నాయనడం ఊహాగానాలకు తెరతీసింది. అనంతరం సంజయ్ రౌత్ సైతం మోదీని పొగుడుతూ ఓరోజు వ్యాఖ్యలు చేశారు. నాటి నుంచి బీజేపీపై శివసేన ఎక్కడా పెద్దగా విమర్శలు చేయకపోవడం గమనార్హం. మరోవైపు పార్టీలో సీనియర్ నేత సర్నాయక్ మాట్లాడుతూ.. శివసేన నేతల్ని కాపాడుకునేందుకు భాజపాతో చేతులు కలపాలని సూచిస్తూ సీఎంకు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఎంవీఏ ప్రభుత్వంలో చీలికలు వచ్చాయని.. శివసేన, భాజపా మళ్లీ ఒకటి కానున్నాయన్న ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!