Rajasthan: ‘భాజపా అధికారంలోకి వచ్చే వరకూ రాత్రి భోజనం చేయను.. తలపాగా చుట్టను’
రాజస్థాన్లో భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు తాను రాత్రి పూట భోజనం చేయనని.. తలపాగ, పూలమాలలు ధరించనని ఆ పార్టీ నేత సతీశ్ పూనియా ప్రతిజ్ఞ చేశారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగుతున్న నేపథ్యంలో ప్రచారంలో పాల్గొనేందుకు రాజస్థాన్ భాజపా
శపథం చేసిన రాజస్థాన్ భాజపా అధ్యక్షుడు
లఖ్నవూ: రాజస్థాన్లో భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు తాను రాత్రి పూట భోజనం చేయనని.. తలపాగ, పూలమాలలు ధరించనని ఆ పార్టీ రాష్ట్ర నేత సతీశ్ పూనియా శపథం చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సతీశ్ యూపీకి వచ్చారు. గురువారం జరిగిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ.. యూపీలో భాజపా తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే రాజస్థాన్లో రైతు వ్యతిరేక, యువత వ్యతిరేక కాంగ్రెస్ను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించి, భాజపాకు అధికారం కట్టబెట్టే వరకు తాను తలపాగ, పూలమాలలు ధరించబోనని ప్రకటించారు. రాత్రి పూట భోజనం తినడం మానేస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వచ్చే ఏడాది(2023) రాజస్థాన్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ భాజపా విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బలమైన నాయకత్వం, ప్రజలకు అనుకూలమైన విధానాలతో తమ పార్టీ భారీ మెజారిటీతో గెలుపొందుతుందని సతీశ్ పూనియా తెలిపారు.
యూపీలోని 403 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 10న జరగనుంది. పూర్తి ఫలితాలు మార్చి 10న వెల్లడవుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత