SP-RLD: లోక్సభ ఎన్నికలు.. యూపీలో ఎస్పీ- ఆర్ఎల్డీ పొత్తు
లోక్సభ ఎన్నికలకు ఉత్తర్ప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్దళ్లు తమ పొత్తు ప్రకటించాయి.
లఖ్నవూ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సీట్ల పంపకాలపై ఆయా పార్టీల మధ్య చర్చలు జోరందుకున్నాయి. ఉత్తర్ప్రదేశ్లో లోక్సభ ఎన్నికలకు (Lok Sabha Elections) రాష్ట్రీయ లోక్దళ్ (RLD)తో సమాజ్వాదీ పార్టీ (SP) తన దోస్తీ కొనసాగించనుంది. ఈమేరకు పొత్తు కుదిరినట్లు ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav), ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌధరీలు శుక్రవారం ప్రకటించారు. విజయం కోసం మనమందరం ఏకమవుదామని అఖిలేశ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ను చౌధరీ రీపోస్ట్ చేస్తూ.. జాతీయ, రాజ్యాంగ విలువలను పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
ఇరునేతల మధ్య జరిగిన సమావేశంలో సీట్ల పంపకాల విషయంలోనూ ఒప్పందం ఖరారైందని రాష్ట్రీయ లోక్దళ్ అధికార ప్రతినిధి ఓ వార్తాసంస్థకు తెలిపారు. పశ్చిమ యూపీలోని ఏడు స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు. ఉత్తర్ప్రదేశ్లో మొత్తం 80 లోక్సభ స్థానాలున్నాయి. ఈ రెండు పార్టీలు 2022 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేశాయి. ఎస్పీ 111, ఆర్ఎల్డీ ఎనిమిది సీట్లు గెలుచుకున్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ కూటమిలో ఆర్ఎల్డీ భాగస్వామిగా ఉంది. మథుర, బాగ్పత్, ముజఫర్నగర్ స్థానాల్లో పోటీ చేసి.. మూడింట ఓడిపోయింది. ఎస్పీకి ఐదు, బీఎస్పీకి 10 సీట్లు వచ్చాయి.
లోక్సభ ఎన్నికల్లో సోలోగానే పోటీ.. బీఎస్పీ అధినేత్రి మాయావతి
చౌధరీ పార్టీ ప్రధాన ఓటు బ్యాంకు జాట్ వర్గమే. ముజఫర్నగర్, కైరానా, బిజ్నౌర్, మథుర, బాగ్పత్, అమ్రోహా, మేరఠ్లు జాట్ జనాభా ఉన్న ఎక్కువగా ఉన్న లోక్సభ నియోజకవర్గాలు. చౌధరి పార్టీ పోటీ చేసే స్థానాలు ఇవే కావచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. గత లోక్సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలతో కలిసి పోటీ చేసిన బీఎస్పీ.. ఈసారి ఒంటరిగానే బరిలో దిగుతామని ప్రకటించింది. ఎస్పీ, ఆర్ఎల్డీలు విపక్ష ‘ఇండియా’ కూటమిలో భాగమే. లోక్సభ ఎన్నికలకు ఇవి పొత్తు ఖరారు చేసుకున్న నేపథ్యంలో.. ఉత్తర్ప్రదేశ్లో సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్ ఎలా ముందుకు వెళ్తుందో తేలాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. -
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు -
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!