MP Polls: సరిహద్దు అవతలివైపు ఉన్నా.. వారిని ఏరిపారేయగలం!.. రాజ్నాథ్ సింగ్
ప్రపంచంలో ఏ శక్తి కూడా ఇప్పుడు భారత్ను బెదిరించే సాహసం చేయదని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు.
భోపాల్: ఎవరైనా దుష్ట కార్యకలాపాలకు పాల్పడేందుకు యత్నిస్తే.. సరిహద్దుకు ఇటువైపు, అవసరమైతే అటువైపు ఉన్నా కూడా వారిని భారత్ ఏరిపారేయగలదని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల (MP Elections) ప్రచారంలో భాగంగా ఇక్కడి భిండ్ జిల్లా గోహద్ నియోజకవర్గంలో నిర్వహించిన ర్యాలీని ఉద్దేశించి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా భారత అభిమానం వెల్లివిరుస్తోందన్నారు.
‘కాంగ్రెస్ హయాంలో విదేశీయులు భారత్ను ఓ బలహీన దేశంగా చెప్పేవారు. ప్రపంచ దేశాలు మన మాటలను పెద్దగా పట్టించుకోలేదు. కానీ, ప్రస్తుతం పరిస్థితులు మారాయి. అంతర్జాతీయ వేదికలపై మనం ఏదైనా చెబితే ప్రపంచం వింటోంది. ఇప్పుడు భారత్ బలహీన దేశం కాదు. ప్రపంచంలో ఏ శక్తి కూడా మనల్ని బెదిరించే సాహసం చేయదు. ఎవరైనా ఏదైనా దుర్మార్గానికి పాల్పడేందుకు యత్నిస్తే.. భారత్ వారిని నిర్మూలిస్తుంది. అవసరమైతే.. సరిహద్దు అవతలి వైపు ఉన్నా కూడా వారిని ఏరిపారేయగలదు’ అని రాజ్నాథ్ వ్యాఖ్యానించారు.
‘మహాదేవ్’ పేరునూ వదిలిపెట్టలేదు..! కాంగ్రెస్పై ప్రధాని మోదీ ధ్వజం
మధ్యప్రదేశ్ అంతకుముందు వెనుకబడిన రాష్ట్రమని, కానీ.. ఇప్పుడు అభివృద్ధి చూడాలంటే ఇక్కడికి వెళ్లాలని దేశ ప్రజలు అంటున్నట్లు రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఇది దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రమని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లో తలసరి ఆదాయం 2001-02లో రూ.11,718గా ఉండగా.. 2023 నాటికి రూ.1.40 లక్షలకుపైగా పెరిగిందని తెలిపారు. భిండ్ జిల్లాలో ప్రతి ఐదు కుటుంబాలకు ఒకరు ఆర్మీలో ఉన్నారని, అలాంటి కుటుంబాలను కలవాలనుకుంటున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా.. మధ్యప్రదేశ్లోని 230 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 17న పోలింగ్ జరగనుంది. డిసెంబరు 13న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూ హక్కు చట్టంతో రైతులకు తీవ్ర నష్టం
భూ హక్కు చట్టం అమలుతో రైతులు, గిరిజనులు తీవ్రంగా నష్టపోతారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. విజయవాడలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. -
జనసేన ప్రచార ప్రధాన కార్యదర్శిగా ఏఎం రత్నం
జనసేన పార్టీ ఎన్నికల ప్రచార ప్రధాన కార్యదర్శిగా ప్రముఖ నిర్మాత ఏఎం రత్నంను పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ నియమించారు. తిరుపతి నియోజకవర్గంపై ప్రత్యేకదృష్టి పెట్టాలని ఆయనకు సూచించారు. -
సీఎఫ్డీ ‘ఏపీ ఎలక్షన్ వాచ్’ వెబ్సైట్ ఆవిష్కరణ
శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు వీలుగా సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో www.apelectionwatch.com పేరుతో ఓ వెబ్సైట్ను ఆవిష్కరించినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. -
‘నిజం మాట్లాడితే నోటీసులిస్తారా?’
సీఎం జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తే చంద్రబాబు, లోకేశ్పై కేసులు పెడతారా? అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
6 వేల మంది రైతుల ఆత్మహత్యలకు జగన్రెడ్డే కారణం
వైకాపా ప్రభుత్వ వ్యవసాయ వ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో ఆరు వేల మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారని ఎన్డీయే నేతలు ధ్వజమెత్తారు. ఈ ఆత్మహత్యలకు జగన్రెడ్డే కారణమని ఆరోపించారు. -
క్యాంపస్లలో వేధింపుల పరిష్కారానికి.. రోహిత్ వేముల చట్టం చేస్తాం: కేసీ వేణుగోపాల్
హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల 2016లో మృతి చెందిన ఘటనపై గతంలో నిర్వహించిన దర్యాప్తులో అనేక వైరుధ్యాలున్నాయని.. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం ఆయన కుటుంబానికి న్యాయం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆదివారం తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
-
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు