భాజపా, జనసేన ధర్మపరిరక్షణ దీక్ష
తూర్పుగోదావరి జిల్లా అతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి దివ్యరథం దగ్ధమైన ఘటనను నిరసిస్తూ జనసేన, భాజపా ఆందోళనబాట పట్టాయి.
హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లా అతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి దివ్యరథం దగ్ధమైన ఘటనను నిరసిస్తూ జనసేన, భాజపా ఆందోళనబాట పట్టాయి. రెండు పార్టీల నేతలు సంయుక్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టారు. ఇందులో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్లోని తన నివాసంలో ధర్మ పరిరక్షణ దీక్ష చేపట్టారు. దీక్షకు ముందు జనసేన ముఖ్య నాయకులతో చర్చించారు.
దిల్లీలో జీవీఎల్ దీక్ష
అంతర్వేది ఘటనపై సీఎం న్యాయ విచారణ జరిపించాలని భాజపా జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. అంతర్వేది ఘటనకు నిరసనగా దిల్లీలోని తన నివాసంలో లక్ష్మీనరసింహస్వామికి పూజలు చేసి నిరసన దీక్షలో కూర్చున్నారు. అరెస్టు చేసిన భాజపా, జనసేన నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవీఎల్తో పాటు ఆ పార్టీ నేతలు సునీల్ దేవధర్, సత్యకుమార్ తదితరులు దీక్షలో పాల్గొన్నారు.
హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు...
పెద్దవాల్తేరు: హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోందని శాసన మండలి సభ్యుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. గురువారం విశాఖలోని భాజపా కార్యాలయంలో అంతర్వేది ఘటనకు నిరసనగా దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో ఇప్పటి వరకు పలు దేవాలయాలపై దాడులు జరిగాయన్నారు. హిందూ దేవాలయాలకు వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వ ఆదాయంగా భావిస్తున్నారన్నారని ఆరోపించారు. మసీదులు, చర్చిలకు వచ్చే ఆదాయాలు ఆ మతస్థులు మాత్రమే వినియోగించుకుంటున్నారని తెలిపారు. అలాంటప్పుడు హిందూ దేవాలయాలను రక్షించాల్సిన పూర్తి బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. అంతర్వేది ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదన్నారు. దేవాలయ భూముల విక్రయం, వాటిని ప్రైవేటు వ్యక్తులకు లీజులకు ఇచ్చే చర్యలను అడ్డుకుంటామని హెచ్చరించారు. అన్య మతాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. అంతర్వేదిలో రథం దగ్ధం చేయడాన్ని ప్రభుత్వం పిచ్చివాడి చర్యగా చెబుతోందని, అక్కడి కలెక్టర్, పోలీసు కమిషనర్ కూడా అలాగే నివేదికలు ఇవ్వడం శోచనీయమన్నారు. మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు, జిల్లా పార్లమెంటు అధ్యక్షుడు ఎం.రవీంద్ర తదితరులు దీక్షలు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!