దీదీ సర్కార్కు రోజులు దగ్గరపడ్డాయ్!
బెంగాల్లో తమ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతులకు న్యాయం చేస్తామని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పట్టుకోల్పోతున్న .....
కత్వా: బెంగాల్లో తమ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతులకు న్యాయం చేస్తామని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పట్టుకోల్పోతున్న విషయాన్ని గ్రహించే దీదీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు అంగీకరించాల్సి వచ్చిందన్నారు. కానీ, ఇప్పటికే ఈ పథకం అమలులో చాలా జాప్యం జరిగిపోయిందని విమర్శించారు. శనివారం ఆయన ‘కర్షక్ సురక్షా అభియాన్’ పేరుతో నిర్వహించిన రైతుల సభలో ప్రసంగించారు.
పీఎం కిసాన్ పథకాన్ని రాష్ట్రంలో ఇప్పటివరకు అమలు చేయని మమతా బెనర్జీ ప్రభుత్వం.. ఇటీవల దీనిపై తన వైఖరిని మార్చుకున్న విషయం తెలిసిందే. కత్వాలో రైతు ర్యాలీని చూస్తుంటే.. మమతా బెనర్జీ ప్రభుత్వం ఇక రోజులు లెక్కపెట్టుకుంటున్నట్టు స్పష్టమవుతోందని వ్యాఖ్యానించారు. ప్రజల ఉత్సాహం చూస్తుంటే దీదీ సర్కార్ను సాగనంపి రాష్ట్రంలో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నట్టు అర్థమవుతోందని చెప్పారు.
మరోవైపు, రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ అధికారం నిలబెట్టుకోవాలని తృణమూల్ కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా.. ఈసారి పాగా వేయాలని భాజపా దూకుడుగా ముందుకెళ్తోంది. ఇప్పటికే సువేందు అధికారి సహా దాదాపు 60మందికి పైగా నేతలు తృణమూల్ కాంగ్రెస్ను వీడి కమలం గూటికి చేరారు. ఈ తరుణంలో ఇరు పార్టీల మధ్య తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతోంది.
ఇదీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!