Kamal haasan: స్టాలిన్తో నా స్నేహం.. రాజకీయాలకు అతీతం: కమల్ హాసన్
సీఎం స్టాలిన్(stalin) పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను సినీ నటుడు కమల్ హాసన్(kamal haasan) ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టాలిన్తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK stalin)తో తన ఫ్రెండ్షిప్ రాజకీయాలకు అతీతమైందని మక్కల్నీది మయ్యమ్ అధినేత, సినీ నటుడు కమల్ హాసన్(Kamal haasan) అన్నారు. స్టాలిన్, తాను ఎప్పటినుంచో స్నేహితులమని చెప్పారు. మార్చి 1న సీఎం స్టాలిన్ 70వ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా
చెన్నైలోని రాజా అన్నామలై ఫోరమ్లో ‘అవర్ సీఎం అవర్ ప్రైడ్’ పేరిట ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను కమల్ ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ మార్చి 12వరకు కొనసాగనుంది.
ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ.. చరిత్రను వక్రీకరించేందుకు(మరీ ముఖ్యంగా తమిళుల చరిత్ర) ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో వాస్తవాలు చెప్పేలా ఇలాంటి కార్యక్రమాలు అవసరమన్నారు. ‘‘నేను, స్టాలిన్ మిత్రులం. మా స్నేహం రాజకీయాలకు అతీతమైనది. ఓ మహా నేత తనయుడు స్టాలిన్. ఆయన ఎన్నో సవాళ్లను ఎదుర్కొని అంచెలంచెలుగా సీఎం స్థాయికి ఎదిగారు. ఇది రాజకీయాల గురించి మాట్లాడే సమయం కాదు. పొత్తుల గురించి ఇప్పుడే చెప్పలేం’’ అన్నారు.
మరోవైపు, డీఎంకే ఎంపీ దయానిధి మారన్ మాట్లాడుతూ.. 2019లో చెన్నైలో మహా కూటమి ఏర్పాటు చేసిన డీఎంకే 2021లో జరిగిన ఎన్నికల్లో ఎన్నికల్లో విజయం సాధించిందన్నారు. 2024లో జరిగే లోక్సభ ఎన్నికల్లో తమిళనాడు, పుదుచ్చేరిలోని మొత్తం 40 లోక్సభ స్థానాల్లో డీఎంకే కూటమి గెలుచుకుంటుందని తమ నేత భరోసా ఇచ్చారన్నారు.
కమల్ హాసన్ డీఎంకే కూటమి వైపు మొగ్గుచూపుతున్నారా అని విలేకరులు అడగ్గా.. ‘‘కమల్హాసన్ భావసారుప్యత కలిగిన వ్యక్తి. ఆయన డీఎంకేకు, సీఎం స్టాలిన్కు మంచి మిత్రుడు. స్టాలిన్ 70వ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ఆయన గౌరవంగా వచ్చారు’’ అని దయానిధి మారన్ చెప్పారు. తమిళనాడులో నిన్న ఈరోడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగ్గా.. డీఎంకే కూటమి అభ్యర్థికి కమల్ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్