వరంగల్ నేతలతో కేసీఆర్ భేటీ.. అభ్యర్థి ఎంపిక అధినేత నిర్ణయానికే!
లోక్సభ ఎన్నిక కార్యాచరణపై భారాస అధినేత కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు.
హైదరాబాద్: లోక్సభ ఎన్నికల కార్యాచరణపై భారాస అధినేత కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. వరంగల్ నియోజకవర్గ పరిధిలోని నేతలతో బుధవారం సమావేశమయ్యారు. ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి తదితర నేతలు సమావేశానికి హజరయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన కార్యాచరణతో పాటు అభ్యర్థిత్వంపై చర్చించారు. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ను మాజీ మంత్రులు దయాకర్రావు, సారయ్య.. కేసీఆర్ నివాసానికి తీసుకొచ్చారు.
అభ్యర్థి ఎంపికను కేసీఆర్ నిర్ణయానికే నేతలు వదిలిపెట్టినట్లు తెలుస్తోంది. అందరితో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటానని అధినేత వారితో చెప్పినట్లు సమాచారం. వరంగల్ ఎంపీగా పోటీ చేసేందుకు ఆరూరి రమేశ్ విముఖత చూపినట్లు తెలుస్తోంది. అభ్యర్థి ఎవరైనా గెలిపించుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అనవసర నిర్ణయాలతో భవిష్యత్ పాడు చేసుకోవద్దని రమేశ్కు కేసీఆర్ సూచించినట్లు సమాచారం. అవకాశమిస్తే మరోసారి పోటీ చేస్తానని ఎంపీ పసునూరి దయాకర్ వెల్లడించారు.
మరోవైపు పొత్తులకు సంబంధించి కేసీఆర్తో బీఎస్పీ నేతలు సమావేశమయ్యారు. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, ఎంపీ రాంజీ గౌతమ్ భేటీ అయ్యారు. లోక్సభ ఎన్నికల్లో పొత్తు, సీట్ల సర్దుబాటుపై నేతలు చర్చిస్తున్నారు. మాయావతి రాయబారిగా చర్చల్లో రాంజీగౌతమ్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. -
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు -
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..