BRS: సీఎం కేసీఆర్ మా పెద్దన్న: దిల్లీ సీఎం కేజ్రీవాల్
భారాస ఆవిర్భావం తర్వాత తొలిసారిగా నిర్వహించిన సభకు ఆ పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
ఖమ్మం: భారాస ఆవిర్భావం తర్వాత తొలిసారిగా నిర్వహించిన సభకు ఆ పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. సీఎం కేసీఆర్తో పాటు దిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తదితరులు హాజరుకావడంతో గులాబీ శ్రేణుల్లో మరింత జోష్ పెరిగింది. ఏపీ, తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి కార్యకర్తలు భారీగా తరలిరావడంతో ఖమ్మం పట్టణం జనసంద్రంగా మారింది.
కంటి వెలుగు దిల్లీలోనూ అమలు చేస్తాం: కేజ్రీవాల్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ను పెద్దన్నగా సంబోధించారు. కంటి వైద్య పరీక్షలు ఉచితంగా అందించడం గొప్ప విషయమన్న కేజ్రీవాల్.. తెలంగాణలో అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని దిల్లీలోనూ అమలు చేస్తామని ప్రకటించారు. ‘‘ మేం ఒకరి నుంచి మరొకరం నేర్చుకుంటాం. దిల్లీ మొహల్లా క్లినిక్లను ఇక్కడ బస్తీ దవాఖానాగా మార్చారు. మొహల్లా క్లినిక్ల పరిశీలనకు కేసీఆర్ దిల్లీ గల్లీలో తిరిగారు. తమిళనాడు సీఎం స్టాలిన్ దిల్లీ పాఠశాలలు పరిశీలించారు. తమిళనాడులోనూ పాఠశాలలు బాగు చేసుకున్నారు. దిల్లీలో ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులు కూడా ప్రభుత్వ స్కూళ్లలో చేరుతున్నారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా దేశం వెనుకబడే ఉంది. మోదీ పాలనలో గవర్నర్లను ఆడిస్తున్నారు. గవర్నర్లు.. సీఎంలను ఇబ్బందులు పెడుతున్నారు. సీఎంలను ఇబ్బందులు పెట్టడంలో ప్రధాని బిజీగా ఉన్నారు. వచ్చే ఎన్నికలు దేశాన్ని మార్చేందుకు ప్రజలకు మంచి అవకాశం’’ అని సీఎం కేజ్రీవాల్ అన్నారు.
లూటీ చేయడం.. అమ్మడమే భాజపా సిద్ధాంతం: భగవంత్ మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మాట్లాడుతూ... భారాస ఆవిర్భావ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడం మార్పునకు తొలి అడుగుగా అభివర్ణించారు. తెలంగాణలో ‘కంటి వెలుగు’ వంటి మంచి పథకం చేపట్టారని కొనియాడారు. ‘‘ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే దేశం ఎటు వెళ్తుందోనని ఆందోళన ప్రజల్లో నెలకొంది. ఏటా 2కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని భాజపా మోసం చేసింది. యువతకు ఉపాధి కల్పిస్తామన్న హమీ నెరవేర్చలేదు. ప్రజల ఖాతాల్లో రూ.15లక్షలు వేస్తామని మోసం చేశారు. హమీలు నెరవేర్చకుండా భాజపా.. భారతీయ జుమ్లా పార్టీగా మారింది. లూటీ చేయడం.. అమ్మడమే భాజపా సిద్ధాంతం. కేంద్ర సంస్థలు ఎల్ఐసీ, రైల్వేను అమ్మకానికి యత్నిస్తోంది. పంజాబ్లో చరిత్రాత్మక విజయం ఆప్ సాధించింది. పంజాబ్లో అవినీతిని రూపుమాపాం. తెలంగాణ మాదిరి కార్యక్రమాలు పంజాబ్లోనూ చేపడతాం. మంచి కార్యక్రమాలు ఎక్కడి నుంచైనా నేర్చుకోవచ్చు. అభివృధ్ధిలో తెలంగాణ దూసుకెళ్తోంది’’ అని భగవంత్ మాన్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయం
వివేకాను జగన్మోహన్రెడ్డే హత్య చేయించారని, మాకంటే ముందు ఆయనే తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయమని ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి అభిప్రాయపడ్డారు. -
బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాంను ప్రజలు మరచిపోలేదు
మంత్రి బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాం గురించి ప్రజలు ఇంకా మరచిపోలేదని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ప్రధాని మోదీని ఉద్దేశించి బొత్స చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. -
తెలంగాణలో ధరణి.. ఏపీలో ల్యాండ్ చట్టం ఒక్కటే
తెలంగాణలో ధరణి చట్టం తీసుకొచ్చిన భారాస ఓడిపోయిందని, ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన జగన్కూ పరాభవం తప్పదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. -
పోలింగ్కు ముందు పథకాల సొమ్ము జమ చేయాలని కుట్రలు
ఎన్నికలకు ఒకటిరెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వ పథకాల సొమ్మును జమ చేయడం ద్వారా వారిని ప్రలోభపెట్టాలని వైకాపా ప్రభుత్వం కుట్రలు చూస్తోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఎవరికివారు నష్టం చేకూర్చుకున్నట్టే
‘ప్రభుత్వాలు తీసుకొచ్చిన విధానాలు సరైనవి కాకపోతే.. అభివృద్ధి, సంక్షేమం, సాధికారికత ఇవేవీ సాధ్యం కావు. -
జేజేపీలో ముసలం!
హరియాణాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. భాజపా సర్కారును పడగొట్టాలని చూస్తున్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి సొంతపార్టీ ఎమ్మెల్యేల నుంచే ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు సమాచారం. -
ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణ
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది.