TS news: కేసీఆర్ నీడను చూసి తానే భయపడుతున్నారు: కిషన్రెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్ తన నీడను చూసి తానే భయపడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. హుజూరాబాద్లో ఈటల రాజేందర్ను ఓడించేందుకు చాలా
వరంగల్: ముఖ్యమంత్రి కేసీఆర్ తన నీడను చూసి తానే భయపడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. హుజూరాబాద్లో ఈటల రాజేందర్ను ఓడించేందుకు చాలా కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. వరంగల్లో నిర్వహించిన జన ఆశీర్వాద యాత్రలో కిషన్రెడ్డి మాట్లాడుతూ.. ఎన్ని కుట్రలు చేసినా.. హుజూరాబాద్లో విజయం భాజపాదేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ కరోనాను సమర్థంగా కట్టడి చేశారన్నారు. అందరికీ ఉచిత వ్యాక్సినేషన్ యజ్ఞంలా కొనసాగుతోందని చెప్పారు. అంతకుముందు హన్మకొండలో మాట్లాడుతూ... ఏడేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని దివాలా తీయించారని ఆరోపించారు. కాంట్రాక్టుల పేరుతో రూ.వేల కోట్లు దోచుకున్నారని విమర్శించారు. ప్రజలు పన్నుల రూపంలో కట్టిన ధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. కుర్చీ, కుటుంబం కోసం సీఎం కేసీఆర్ దేనికైనా సిద్ధపడతారని ఆరోపించారు. అంతకుముందు తొర్రూర్, వర్ధన్నపేటలో జరిగిన కార్యక్రమంలో కిషన్రెడ్డి మాట్లాడుతూ.. అధికార తెరాసపై విమర్శనాస్త్రాలు సంధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైఎస్ షర్మిలపై కేసు నమోదు
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila)పై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి వివేకా హత్య కేసును ప్రస్తావించినందుకు ఆమెపై వైఎస్సార్ జిల్లా బద్వేలు పోలీసులు కేసు నమోదు చేశారు. -
కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. -
‘క్రిటికల్ రివర్’ కంపెనీ వెనుక ఐటీ సలహాదారు శేషిరెడ్డి
క్రిటికల్ రివర్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ వెనక వైకాపావారు, ఐటీ సలహాదారు పాటూరి శేషిరెడ్డి ఉన్నారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ఆరోపించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తొలుత రూపొందించింది జగన్ ప్రభుత్వమే
దేశంలో తొలిసారిగా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రూపొందించిందే జగన్ ప్రభుత్వం అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన బిల్లును కేంద్రం తిప్పి పంపినా మూడు సార్లు ఆమోదం కోసం పంపారని గుర్తుచేశారు. -
సీఎస్ను వెంటనే బదిలీ చేయాలి: రఘురామ
రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగాలంటే సీఎస్నూ వెంటనే బదిలీ చేయాలని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు డిమాండు చేశారు. -
రాముడిని ఆరాధించానని దాడి చేశారు
కాంగ్రెస్ను వీడిన రాధికా ఖేడా ఆ పార్టీ ఛత్తీస్గఢ్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాముడి భక్తురాలిని అయినందుకే తనపై దాడి చేశారని సోమవారం ఆమె మీడియాకు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
Team India: పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..
-
ఒకే ఫ్రేమ్లో ఇద్దరు సీఈఓలు.. సుందర్ పిచాయ్ గ్రాడ్యుయేషన్ ఫొటో వైరల్
-
చేతులూ కాళ్లూ కట్టేసి సిగరెట్లతో భర్తకు వాతలు.. వీడియోతో పోలీస్స్టేషన్కు బాధితుడు!
-
అభ్యంతరకర వీడియోలున్న.. 25వేల పెన్డ్రైవ్లను పంచారు: కుమారస్వామి
-
రష్యా అధినేతగా ఐదోసారి.. ఘనంగా పుతిన్ ప్రమాణస్వీకారం
-
సరదా సరదాగానే సిక్స్లు బాదేస్తాడు.. అదే స్పిన్ బౌలింగ్లోనైతే..: రవిశాస్త్రి