TS news: కేసీఆర్‌ నీడను చూసి తానే భయపడుతున్నారు: కిషన్‌రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన నీడను చూసి తానే భయపడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ను ఓడించేందుకు చాలా

Updated : 24 Sep 2022 17:04 IST

వరంగల్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన నీడను చూసి తానే భయపడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ను ఓడించేందుకు చాలా కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. వరంగల్‌లో నిర్వహించిన జన ఆశీర్వాద యాత్రలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్ని కుట్రలు చేసినా.. హుజూరాబాద్‌లో విజయం భాజపాదేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ కరోనాను సమర్థంగా కట్టడి చేశారన్నారు. అందరికీ ఉచిత వ్యాక్సినేషన్‌ యజ్ఞంలా కొనసాగుతోందని చెప్పారు. అంతకుముందు హన్మకొండలో మాట్లాడుతూ... ఏడేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రాన్ని దివాలా తీయించారని ఆరోపించారు. కాంట్రాక్టుల పేరుతో రూ.వేల కోట్లు దోచుకున్నారని విమర్శించారు.  ప్రజలు పన్నుల రూపంలో కట్టిన ధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. కుర్చీ, కుటుంబం కోసం సీఎం కేసీఆర్‌ దేనికైనా సిద్ధపడతారని ఆరోపించారు. అంతకుముందు తొర్రూర్‌, వర్ధన్నపేటలో జరిగిన కార్యక్రమంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. అధికార తెరాసపై విమర్శనాస్త్రాలు సంధించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు