కేసీఆర్‌ సార్‌.. ఇకనైనా కళ్లుతెరవండి!

కరోనా చికిత్సను వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. కొవిడ్‌ను ఆరోగ్యశ్రీ చేరుస్తామని

Published : 16 May 2021 00:26 IST

కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి

హైదరాబాద్‌: కరోనా చికిత్సను వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. కొవిడ్‌ను ఆరోగ్యశ్రీ చేరుస్తామని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా చెప్పారని, ప్రస్తుతం ఏమైదని ప్రశ్నించారు. కేసీఆర్‌ సర్కార్‌ వల్ల మెరుగైన వైద్యం చేయించుకోలేక ఇంకా ఎంతమంది పేదలు ప్రాణాలు కోల్పోవాలని నిలదీశారు. కరోనాతో చనిపోతున్న వారివన్నీ ముమ్మాటికీ హత్యలేనన్నారు. సీఎం కేసీఆర్‌ ఇకనైనా కళ్లుతెరవాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని