KTR: అది ఏప్రిల్ ఫూల్ జోక్ అయితే బాగుండేది: కేటీఆర్ ట్వీట్
ఎల్పీజీ సిలిండర్ ధర పెరుగుదల ఏప్రిల్ ఫూల్ తరహా జోక్ అయితే బాగుండేదని తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: ఎల్పీజీ సిలిండర్ ధర పెరుగుదల ఏప్రిల్ ఫూల్ తరహా జోక్ అయితే బాగుండేదని తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. వాణిజ్య సిలిండర్ ధర రూ.250కి పైగా పెరిగిందనే ఓ వార్తా కథనంపై ట్విటర్లో ఆయన చమత్కారంగా స్పందించారు. ఇది ఏప్రిల్ ఫూల్ జోక్ కావాలని సీరియస్గా తాను భావిస్తున్నట్లు ట్వీట్లో పేర్కొన్నారు.
మరో ట్వీట్లో ‘అచ్చే దిన్ దివస్’ను ఏప్రిల్ ఫూల్స్ డేగా పోలుస్తూ వ్యంగ్యంగా స్పందించారు. అటు కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్రమోదీని విమర్శిస్తూ తాను పోస్టింగ్స్ పెట్టిన ప్రతిసారీ ఇబ్బంది పడే వారు ట్విటర్లో తనను అనుసరించవద్దని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కేంద్రం, భాజపా మతతత్వ విధానాలు, దుష్ప్రచారాన్ని తాను ఎండగడుతూనే ఉంటానని ఆయన పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!