BRS: కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చి తప్పు చేశామని ప్రజలు అంటున్నారు: కేటీఆర్‌

మంచి ప్రభుత్వాన్ని ఓడించి తప్పు చేశామని ప్రజలు అంటున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ చెప్పారు.

Updated : 10 Mar 2024 16:06 IST

కామారెడ్డి: మంచి ప్రభుత్వాన్ని ఓడించి తప్పు చేశామని ప్రజలు అంటున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ చెప్పారు. త్వరలో పార్లమెంట్‌ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కామారెడ్డిలోని పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశమై మాట్లాడారు. కామారెడ్డిలో గంప గోవర్ధన్‌ నాయకత్వంలోనే పార్లమెంట్‌ ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు.

‘‘అసంబద్ధమైన హామీలు ఇచ్చి కామారెడ్డిలో కేసీఆర్‌ను ఓడించారు. డిసెంబర్‌ 9న రూ.2లక్షల రుణమాఫీ చేస్తామన్నారు.. ఏమైంది? చిత్తశుద్ధి ఉంటే వెంటనే రుణమాఫీ చేయాలి. 100 రోజులు అయ్యాక ఆడబిడ్డలు కాంగ్రెస్‌ భరతం పడతారు. మేడిగడ్డలో 85 పిల్లర్లు ఉంటే 3 పిల్లర్లు కుంగాయి. మూడు నెలల్లో ఆ పిల్లర్లను బాగు చేయలేరా?’’అని కేటీఆర్‌ ప్రశ్నించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని