KTR: పోలీసులపై ఎంఐఎం కార్పొరేటర్ దుర్భాషలు.. చర్యలు తీసుకోవాలని డీజీపీకి కేటీఆర్ ట్వీట్
నగరంలోని భోలక్పూర్లో పోలీసులపై కొందరు వ్యక్తులు దురుసుగా ప్రవర్తించిన ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీని మంత్రి కేటీఆర్ కోరారు.
హైదరాబాద్: నగరంలోని భోలక్పూర్లో పోలీసులపై కార్పొరేటర్ సహా కొందరు వ్యక్తులు దురుసుగా ప్రవర్తించిన ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీని మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు డీజీపీ మహేందర్రెడ్డికి ఆయన ట్వీట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భోలక్పూర్లో దుకాణాలు మూసేయాల్సిందిగా స్థానిక పోలీసులు కోరారు. రంజాన్ సందర్భంగా దుకాణాలు తెరుచుకున్నామంటూ కొందరు దుకాణదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన ఎంఐఎం కార్పొరేటర్ గౌసుద్దీన్ పోలీసులపై దుర్భాషలాడారు. దుకాణాలను మూసివేయించేందుకు వెళ్లిన పోలీసులను అడ్డుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
‘‘రంజాన్ మాసంలో తెల్లవార్లూ హోటళ్లు తెరిచి ఉంటాయి. నిర్వాహకులను ఇబ్బంది పెట్టొద్దు. పోలీసులు తమాషాలు చేస్తున్నారు. తమ డ్యూటీ తాము చేసుకొని వెళ్లిపోవాలి’’ అని కార్పొరేటర్ అంటున్నట్లు వీడియోలో ఉంది. తమ డ్యూటీ తాము చేస్తున్నామని ఓ కానిస్టేబుల్ అనగానే ‘‘రూ.100 వ్యక్తివి నువ్వు.. నాకు సమాధానం చెబుతావా? మీ ఎస్సైని పిలిపించు.. కార్పొరేటర్ వచ్చాడని చెప్పు’’ అంటూ ఆయన దురుసుగా మాట్లాడారు.
ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ కేటీఆర్కు ట్వీట్ చేస్తూ కార్పొరేటర్ఫై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో కేటీఆర్ ఈ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించిన వాళ్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఇలాంటి చర్యలను ఉపేక్షించవద్దని.. రాజకీయాలకు అతీతంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి