HD Kumaraswamy: భాజపా, జేడీఎస్ పొత్తు ఖరారు కాలేదా..?కుమారస్వామి ఏమన్నారంటే..!
భాజపా-జేడీఎస్(BJP-JDS) పొత్తుపై ఇరు పార్టీల నాయకులు భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. నిన్న యడ్డీ పొత్తుకు అనుకూలంగా మాట్లాడగా.. కుమారస్వామి(HD Kumaraswamy) అందుకు విరుద్ధంగా స్పందించారు.
బెంగళూరు: రానున్న లోక్సభ ఎన్నికల కోసం కర్ణాటకలో భాజపా(BJP), జేడీఎస్(JDS) కలిసి పోటీ చేయాలని తీర్మానించాయని భాజపా పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, మాజీ సీఎం బి.ఎస్.యడియూరప్ప(Yediyurappa) వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి(HD Kumaraswamy) భిన్నంగా స్పందించారు. సీట్ల పంపకాలపై ఇప్పటివరకు తమ మధ్య ఎలాంటి చర్చ జరగలేదన్నారు.
‘యడియూరప్ప(Yediyurappa) చెప్పిన మాటలు ఆయన వ్యక్తిగతం. సీట్ల పంపకాలు, ఇతర విషయాలపై ఇప్పటివరకు ఎలాంటి చర్చ జరగలేదు. మేం ఇప్పటివరకు రెండుమూడు సార్లు సమావేశమయ్యాం. అవి ఆత్మీయ భేటీలు. మున్ముందు ఏం జరుగుతుందో చూద్దాం. ఎన్నికల కోసం చర్చలు జరిపే అవకాశం ఉంది. అదంతా ప్రజల కోసమే. వారికి ప్రత్యామ్నాయ ప్రభుత్వం కావాలి. ఎందుకంటే కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని దోచుకుంటోంది. 2006లో నేను భాజపాతో కలిసిపనిచేశాను. ఆ సమయంలో నేను 20 నెలల పాటు అందించిన పాలనతో నాపై సదాభిప్రాయం ఏర్పడింది’ అని కుమారస్వామి మీడియాతో వ్యాఖ్యానించారు.
చంద్రబాబు అరెస్టు.. అర్ధరాత్రి నుంచి ఎప్పుడేం జరిగిందంటే?
ఇదిలా ఉంటే.. దిల్లీలో మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ, భాజపా అగ్రనేత, కేంద్ర మంత్రి అమిత్ షాతో చర్చల సందర్భంగా పొత్తు కుదిరినట్లు యడ్డీ శుక్రవారం వెల్లడించారు. రాష్ట్రంలోని మొత్తం 28 లోక్సభ స్థానాల్లో నాలుగింటిని జేడీఎస్కు విడిచిపెట్టాలని భాజపా నిర్ణయించినట్లు తెలిపారు. హాసన, బెంగళూరు గ్రామీణం, కోలారు, తుమకూరు నియోజకవర్గాల్లో జేడీఎస్ పోటీ చేయనుండగా, భాజపా మద్దతివ్వనుందన్నారు. 2019 ఎన్నికల సమయంలో కాంగ్రెస్తో పొత్తుపెట్టుకున్న జేడీఎస్ 7 స్థానాల్లో పోటీ చేసి, ఒక సీటు మాత్రమే గెలుచుకుంది. యడ్డీ చెప్పిన ప్రకారం.. జేడీఎస్కు కేటాయించిన లోక్సభ స్థానాల సంఖ్య తగ్గడం కుమారస్వామి నుంచి భిన్నమైన స్పందన రావడానికి కారణం కావొచ్చని తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూ హక్కు చట్టంతో రైతులకు తీవ్ర నష్టం
భూ హక్కు చట్టం అమలుతో రైతులు, గిరిజనులు తీవ్రంగా నష్టపోతారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. విజయవాడలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. -
జనసేన ప్రచార ప్రధాన కార్యదర్శిగా ఏఎం రత్నం
జనసేన పార్టీ ఎన్నికల ప్రచార ప్రధాన కార్యదర్శిగా ప్రముఖ నిర్మాత ఏఎం రత్నంను పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ నియమించారు. తిరుపతి నియోజకవర్గంపై ప్రత్యేకదృష్టి పెట్టాలని ఆయనకు సూచించారు. -
సీఎఫ్డీ ‘ఏపీ ఎలక్షన్ వాచ్’ వెబ్సైట్ ఆవిష్కరణ
శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు వీలుగా సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో www.apelectionwatch.com పేరుతో ఓ వెబ్సైట్ను ఆవిష్కరించినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. -
‘నిజం మాట్లాడితే నోటీసులిస్తారా?’
సీఎం జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తే చంద్రబాబు, లోకేశ్పై కేసులు పెడతారా? అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
6 వేల మంది రైతుల ఆత్మహత్యలకు జగన్రెడ్డే కారణం
వైకాపా ప్రభుత్వ వ్యవసాయ వ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో ఆరు వేల మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారని ఎన్డీయే నేతలు ధ్వజమెత్తారు. ఈ ఆత్మహత్యలకు జగన్రెడ్డే కారణమని ఆరోపించారు. -
క్యాంపస్లలో వేధింపుల పరిష్కారానికి.. రోహిత్ వేముల చట్టం చేస్తాం: కేసీ వేణుగోపాల్
హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల 2016లో మృతి చెందిన ఘటనపై గతంలో నిర్వహించిన దర్యాప్తులో అనేక వైరుధ్యాలున్నాయని.. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం ఆయన కుటుంబానికి న్యాయం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆదివారం తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
అక్కడికి వెళ్తే.. ఇంటికి తిరిగి వెళ్లినట్టుగా ఉంటుంది: సునీతా విలియమ్స్
-
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్
-
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
-
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం