Chandrababu: చంద్రబాబు అరెస్టు.. అర్ధరాత్రి నుంచి ఎప్పుడేం జరిగిందంటే?
అత్యంత నాటకీయ పరిణామాల మధ్య తెదేపా అధినేత చంద్రబాబునాయుడిని సీఐడీ పోలీసులు శనివారం తెల్లవారుజామున అరెస్టు చేశారు.
నంద్యాలలో అనుక్షణం హైటెన్షన్
పలువురి తెదేపా నాయకులు, కార్యకర్తల అరెస్టు
చంద్రబాబు బస చేసిన బస్సు అద్దాలు బాదిన పోలీసులు
5.30 గంటల ప్రాంతంలో కిందికి దిగిన బాబు
ఈనాడు - కర్నూలు : అత్యంత నాటకీయ పరిణామాల మధ్య తెదేపా అధినేత చంద్రబాబునాయుడిని సీఐడీ పోలీసులు శనివారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. చంద్రబాబును అరెస్టు చేస్తారంటూ వార్తలు రావడం.. అనంతపురం నుంచి ఆరు బస్సుల్లో భారీగా పోలీసులు రావడం.. శుక్రవారం అర్ధరాత్రి నుంచి నంద్యాల పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. అరెస్టు చేస్తారన్న సమాచారం అందుకున్న తెదేపా నాయకులు, కార్యకర్తలు భారీగా చంద్రబాబునాయుడు బస చేసిన ఆర్.కె.ఫంక్షన్ హాలు వద్దకు చేరుకున్నారు. పార్టీ నేతలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మూడు గంటల ప్రాంతంలో చంద్రబాబు బస చేస్తున్న బస్సు వద్దకు పోలీసులు వెళ్లే ప్రయత్నం చేశారు. నేతలు తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ సమయంలో ఎందుకు వచ్చారని తెదేపా నాయకులు ప్రశ్నించారు. మీకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని.. నేరుగా చంద్రబాబు నాయుడుకే చెబుతామని పోలీసు అధికారులు పేర్కొన్నారు.
దీనిపై నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫంక్షన్ హాలు వద్ద అడ్డుగా ఉన్న వాహనాలను తొలగించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చంద్రబాబునాయుడితో చర్చలు జరిపారు. మాజీ మంత్రి అఖిలప్రియ, మాజీ ఎమ్మెల్యేలు భూమా బ్రహ్మానందరెడ్డి, బీసీ జనార్దన్రెడ్డి, మరికొందరు నాయకులను అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్కు తరలించారు. అనంతరం చంద్రబాబు విశ్రమిస్తున్న బస వద్దకు చేరుకుని బస్సు అద్దాలు గట్టిగా తట్టారు. బాబు బస్సు నుంచి కిందికి రావడంతో పోలీసులు ఆయనతో మాట్లాడారు. చంద్రబాబు మాట్లాడుతూ తన హక్కులను ఉల్లంఘిస్తున్నారని అన్నారు. తాను తప్పు చేస్తే నడిరోడ్డుపై ఉరితీయండి అని చెప్పారు. ఏ చట్టం ప్రకారం నన్ను అరెస్టు చేస్తారో చెప్పాలని నిలదీశారు. ప్రాథమిక ఆధారాలు లేకుండా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు.
తాము హైకోర్టుకు ప్రాథమిక ఆధారాలు ఇచ్చామని పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఆధారాలు చూపాలంటూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోరగా రిమాండు రిపోర్టులో అన్ని వివరాలు ఉన్నాయని చెప్పారు. దాదాపు గంటపాటు వాదప్రతివాదాలు జరిగాయి. అవినీతి ఆరోపణలపై అరెస్టు చేస్తున్నట్లు నోటీసులో పోలీసులు పేర్కొన్నారు. మీరు మాతో విజయవాడకు బయలుదేరితే 15 నిమిషాల్లో మీరు కోరిన అన్ని పత్రాలు వాట్సాప్లో పంపిస్తామన్నారు. అనంతరం చంద్రబాబుకు వైద్యపరీక్షలు నిర్వహించి ఆయన భద్రతాదళం సమక్షంలోనే విజయవాడకు తీసుకెళ్లారు.
అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉత్కంఠ
‘బాబు స్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమంలో భాగంగా ఆయన శుక్రవారం రాత్రి నంద్యాలలో బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం అర్ధరాత్రి 12 గంటల నుంచి శనివారం తెల్లవారే వరకు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నంద్యాలలో తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు బస చేసిన ఫంక్షన్ హాల్ను వందలాదిమంది పోలీసులు చుట్టుముట్టారు. 600 మందికిపైగా పోలీసులు నంద్యాలకు చేరుకున్నారు. పట్టణాన్ని దిగ్బంధించారు. అడుగడుగునా చెక్పోస్టులు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. చంద్రబాబు బస చేస్తున్న ఆర్.కె.ఫంక్షన్ హాల్ చుట్టూ ఎస్పీ రఘువీర్రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు మోహరించారు. అనంతరం డీఐజీ రఘురామిరెడ్డి, ఎస్పీ రఘువీర్రెడ్డి అక్కడికి చేరుకున్నారు. అడ్డుగా బైఠాయించిన తెదేపా శ్రేణుల్ని నెట్టుకుంటూ పోలీసులు ఫంక్షన్ హాల్ లోపలికి ప్రవేశించారు. మొదట చంద్రబాబు ముఖ్య భద్రతాధికారితో సంప్రదింపులు జరిపారు. అనంతరం ఆయన నిద్రిస్తున్న బస్సు వద్దకు చేరుకుని నిద్రలేపేందుకు ప్రయత్నిస్తుండగా నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు.
ఠాణాకు తెదేపా నేతల తరలింపు
ఆర్.కె.ఫంక్షన్ హాల్ ప్రాంగణం నుంచి తెదేపా కార్యకర్తలు, మీడియా ప్రతినిధులను దూరంగా పంపివేసిన పోలీసులు తర్వాత లోపల ఉన్న వారి వాహనాలనూ తొలగించారు. అనంతరం పోలీసు వాహనాలను లోపలికి తీసుకెళ్లారు. లోపల ఉన్న తెదేపా నాయకులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. చంద్రబాబు బస్సు వద్ద రక్షణగా ఉన్న భూమా బ్రహ్మానందరెడ్డి, భూమా అఖిలప్రియ, జగత్విఖ్యాత్రెడ్డి, బీసీ జనార్దన్రెడ్డి, ఎ.వి.సుబ్బారెడ్డి తదితరులను మహానంది ఠాణాకు తరలించారు. ఆ ప్రాంగణాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
నేతల ప్రతిఘటన
రాత్రి 3 గంటల సమయంలో అధికారులు చంద్రబాబును నిద్రలేపేందుకు ప్రయత్నించారు. డీఐజీ రఘురామిరెడ్డి, తెదేపా నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. తెదేపా కర్నూలు జిల్లా అధ్యక్షుడు బి.టి.నాయుడు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు తలుపునకు అడ్డుగా నిల్చుని తీవ్రంగా ప్రతిఘటించారు. పగలంతా కార్యక్రమాల్లో పాల్గొని అలసిపోయిన తమ నేత ప్రస్తుతం విశ్రమిస్తున్నారని చెప్పారు. ఇంత రాత్రి సమయంలో ఆయన్ను ఎందుకు నిద్రలేపేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు. ఇందుకు డీఐజీ స్పందిస్తూ మేం మీతో మాట్లాడటం లేదు. మాజీ ముఖ్యమంత్రి ముఖ్య భద్రతాధికారితో చర్చిస్తున్నాం. మధ్యలో మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారన్నారు. తెదేపా అధినేతను జిల్లాకు తానే ఆహ్వానించానని, మీరు ఏదైనా ఉంటే నాతోనే మాట్లాడండని బీటీ నాయుడు చెప్పారు. తాము బస్సులోపల ఏం జరుగుతుందో తెలుసు కోవాలనుకుంటున్నాం. చంద్రబాబుతో మాట్లాడాలని భావిస్తున్నట్లు పోలీసు అధికారులు చెప్పారు. ఇందుకు నాయకులు, తెదేపా కార్యకర్తలు ససేమిరా అన్నారు.
బస్సునే లాక్కెళతాం..
చంద్రబాబును నిద్రలేపేందుకు తాము ఒప్పుకోమని తెదేపా నాయకులు స్పష్టం చేశారు. మీరు ఇలా అడ్డుకుంటే బాబు బస చేస్తున్న బస్సునే లాక్కెళతామని పోలీసులు బెదిరించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి విశ్రమిస్తున్న బస్సును లాక్కెళతామనడం అన్యాయమని కాలవ శ్రీనివాసులు, ఇతర తెదేపా నాయకులు ఖండించారు. మీరు ఏం చర్యలు తీసుకోవాలన్నా, ఏం మాట్లాడాలనుకున్నా ఉదయం రావాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శిక్ష ఎస్పీకి.. నేరం ఎవరిది?
పల్నాడులో పోలింగ్ రోజు, అనంతర హింసాకాండ నేపథ్యంలో.. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. -
రెండు రోజుల్లో రూ.4వేల కోట్ల చెల్లింపులు
పోలింగ్ ముగిసి నాలుగు రోజులైనా పేదల పథకాల సొమ్ములకు మోక్షం కలగడం లేదు. మరో వైపు ఉన్న నిధుల్లో అనుయాయ గుత్తేదారులకు చెల్లింపులు కొనసాగుతున్నాయి. -
పోస్టింగ్ ఇవ్వకుండానే పంపించే పన్నాగం!
ప్రభుత్వమే ఫ్యాక్షనిస్టుగా మారితే... గిట్టనివారిని ఏ స్థాయిలో వేధిస్తుందో, ఎంతలా కక్ష సాధిస్తుందో డీజీ ర్యాంకు కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఉదంతమే తిరుగులేని ఉదాహరణ. -
రక్తపు మడుగులో ఉన్నవారిని లంచం అడిగిన పోలీసులు!
తాము నమ్మిన పార్టీకి ఓటేస్తామని ధైర్యంగా చెప్పడమే వారు చేసిన తప్పు! వైకాపా నాయకులు డబ్బులిస్తామని ఆశ చూపినా, భయపెట్టినా వెరవక స్థిరంగా నిలవడమే మహాపరాధం!! అది విని రెచ్చిపోయిన వైకాపా రౌడీమూకలు ఇనుప రాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. -
పోలీసులు కాదు.. గులాములే
వైకాపాతో అంటకాగుతూ.. పోలింగ్ నాడు, ఆ తర్వాత పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసకు అన్ని విధాలుగా సహకరించి సస్పైండైన ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలపై ఎన్నికల సంఘం క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. -
విభాగాల విలీనంతో ప్రాధాన్యం కోల్పోతున్న వర్సిటీలు
చదువుల పెన్నిధిగా.. పరిశోధనలకు పట్టుగొమ్మలుగా విరాజిల్లాల్సిన విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో మొక్కుబడి విద్యా సంస్థలుగా మారుతున్నాయి. -
చిన్నారులను వేధిస్తున్న పోషకాహార లోపం
రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార లోపంతో బాధపడే ఐదేళ్లలోపు చిన్నారులు పెద్దసంఖ్యలో ఉన్నారు. రేపటి పౌరులను ఆరోగ్యవంతులుగా తయారు చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కేంద్రాల్లోని చిన్నారుల పరిస్థితే ఇలా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. -
గడువు ముగిసినా.. పౌర సేవలు గగనమే!
ప్రజలకు నిర్దేశిత గడువులోగా పౌర సేవలు అందించాలన్న విధానం పట్టణ స్థానిక సంస్థల్లో పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. -
వారికి ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలి
తిరుమల శ్రీవారి సన్నిధిలో ‘మేల్చాట్ వస్త్రం’ ‘తిరుప్పావడ’ సేవలకు నిర్ణీత రుసుము చెల్లించిన తర్వాత అర్ధాంతరంగా రద్దు చేసినందుకు తితిదే.. భక్తులకు ఆ సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని, లేకుంటే రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని మహబూబ్నగర్ జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు అనురాధ, సభ్యులు చంద్రశేఖర్రెడ్డి, విజయలక్ష్మి ఇటీవల తీర్పు వెలువరించారు. -
విజయనగరంలో జిందాల్ పరిశ్రమ మూసివేత
ఏపీలోని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్నపాలెంలోని మెసర్స్ జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ పరిశ్రమను సంబంధిత యాజమాన్యం మూసివేసింది. -
వేతనాల సొమ్ము తిరిగి ఇవ్వండి
ప్రభుత్వ సర్వీసులో ఉంటూ పీజీ వైద్య విద్యను పూర్తిచేసి, అయిదేళ్ల పాటు పనిచేయకుండా అనధికారికంగా సెలవులో ఉన్న 70 మంది వైద్యులు.. రూ.20 లక్షలతోపాటు చదివే సమయంలో పొందిన ప్రభుత్వ వేతనాల్ని తిరిగి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. -
కేజీహెచ్ సూపరింటెండెంట్కు అస్వస్థత.. కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స
విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రి(కేజీహెచ్) సూపరింటెండెంట్ డాక్టర్ పి.అశోక్కుమార్ గురువారం అస్వస్థతకు గురై నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
రెండో రోజు ఏపీఈఏపీసెట్కు 91.62 శాతం మంది హాజరు
జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో ఆన్లైన్లో నిర్వహించిన ఏపీఈఏపీ సెట్-2024.. రెండోరోజు రాష్ట్రంలో, హైదరాబాద్లోనూ ప్రశాంతంగా జరిగిందని సెట్ ఛైర్మన్, ఉపకులపతి జి.వి.ఆర్.ప్రసాదరాజు తెలిపారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ ప్రక్రియ వాయిదా
రాష్ట్రంలో ఈ-ఆఫీస్ అప్గ్రేడ్ ప్రక్రియను వాయిదా వేయాల్సిందిగా ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించాలన్నది ప్రభుత్వ ఆలోచన. -
రేపు అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వార్షిక కల్యాణోత్సవాన్ని ఈ నెల 19వ తేదీన నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. -
శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. దర్శనానికి దాదాపు 30 గంటలకుపైగా సమయం పడుతోంది. -
గోదావరిలో ఇసుక మా‘రీచు’లు!
ఇసుక అక్రమ తవ్వకాలను కట్టడి చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసినా గోదావరిలో అడ్డుకట్ట పడటంలేదు. భారీ యంత్రాలతో డ్రెడ్జింగ్ చేస్తున్నారు. -
ఇసుక లారీలకు టార్పాలిన్ తప్పనిసరి చేయండి
ఇసుక, ఇతర ఖనిజ సంపద రవాణా సమయంలో లారీల ద్వారా కలుగుతున్న వాయు, శబ్ద కాలుష్య నివారణ, గ్రామస్థులకు కలుగుతున్న అసౌకర్యాన్ని తొలగించేందుకు హైకోర్టు కీలక చర్యలు చేపట్టింది. -
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!
ఆమె నిండు గర్భిణి.. ఆపై పురిటి నొప్పులు.. బాధను భరించలేక తల్లడిల్లుతున్న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సరైన దారి లేదు. గ్రామానికి వాహనమొచ్చే మార్గమూ కనిపించలేదు. -
పేదింటి ఉత్తమ విద్యార్థులకు విమాన ప్రయాణం
పేద విద్యార్థుల ప్రతిభా ప్రోత్సాహక విషయంలో ఇచ్చిన మాట ప్రకారం స్పందించారు తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మాదనపాలేనికి చెందిన ఉమాపతి. -
రాబడుల్లో ఇలా మిగిలాం!
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితులు తెలంగాణతో పోలిస్తే గడిచిన ఐదేళ్లుగా మరీ దిగజారిపోయాయి. ఆ రాష్ట్రంలో సొంత రెవెన్యూ రాబడులు పెరుగుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
మీ కార్యాలయానికే వస్తాం.. ధైర్యముంటే అరెస్టు చేసుకోండి: కేజ్రీవాల్ సవాల్
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
-
ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
దీదీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్ కాదు: ఖర్గే
-
కోనసీమ జిల్లాలో విషాదం.. ముగ్గురు యువకులు మృతి