Navjot Singh Sidhu: నా డ్రైవర్ లాంటి వ్యక్తి.. ఆయనతో నాకు పోటీనా..?
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పంజాబ్లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక, పార్టీల ప్రచారం, నామినేషన్ల పర్వం జోరందుకుంది.
ప్రత్యర్థిపై సిద్ధూ వివాదాస్పద వ్యాఖ్యలు
చండీగఢ్: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతోన్న వేళ పంజాబ్లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక, పార్టీల ప్రచారం, నామినేషన్ల పర్వం జోరందుకుంది. కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ నేడు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ప్రత్యర్థిపై సిద్ధూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన తన డ్రైవర్తో సమానమంటూ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.
ఈ ఎన్నికల్లో అమృత్సర్ తూర్పు నుంచి నవజ్యోత్ సింగ్ బరిలోకి దిగుతున్నారు. ఇందుకోసం ఆయన శనివారం ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తన ప్రత్యర్థి, శిరోమణి అకాలీదళ్ నేత బిక్రమ్ సింగ్ మజీతియాపై వ్యాఖ్యలు చేశారు. ‘‘మజీతియా నా డ్రైవర్ లాంటి వ్యక్తి. ఆయన నాకు పోటీయే కాదు’’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. ధైర్యముంటే మజీతియా.. అమృత్సర్ తూర్పు ఒక స్థానం నుంచే పోటీ చేయాలని సవాల్ విసిరారు. తన 17 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ తప్పూ చేయలేదని, అందువల్ల తనను ఎవరూ ఓడించలేరని సిద్ధూ అన్నారు. అమృత్సర్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
అమృత్సర్ తూర్పు స్థానం నుంచి మాజీ మంత్రి బిక్రమ్ సింగ్ మజీతియా పోటీ చేయనున్నట్లు ఇటీవల శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ ప్రకటించారు. దీంతో పాటు మజీతా నుంచి కూడా మజీతియానే అభ్యర్థిగా ప్రకటించింది. డ్రగ్స్ కేసులో కొద్దిరోజుల క్రితం బిక్రమ్ అరెస్టయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన బెయిల్పై విడుదలయ్యారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆయన అరెస్టు విషయంతో సిద్ధూ కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. మజీతియా మాదకద్రవ్యాల దందా నిర్వహిస్తున్నారంటూ ఆరోపణలు రావడం పంజాబ్ రాజకీయాల్లో కలకలం రేపింది. ఈ విషయంపై మండిపడ్డ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ సిద్ధూ.. ఆయనను అరెస్టు చేయించేంతవరకూ నిద్రపోనని శపథం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక