దీదీ ఆత్మపరిశీలన చేసుకోవాలి..! అమిత్ షా
బెంగాల్ ప్రజలు తృణమూల్పై ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారనే విషయంపై మమతా బెనర్జీ ఆత్మపరిశీలన చేసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సూచించారు.
ఓటమి భయంతోనే కేంద్ర బలగాలపై విమర్శలు
కోల్కతా: బెంగాల్ ప్రజలు తృణమూల్పై ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారనే విషయంపై మమతా బెనర్జీ ఆత్మపరిశీలన చేసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సూచించారు. ప్రస్తుతం జరుగుతోన్న అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్కు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. నాలుగో దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోల్కతాలో పర్యటిస్తోన్న అమిత్ షా, ఇప్పటివరకు 91 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ పూర్తికాగా, వీటిలో 60కి పైగా స్థానాల్లో భాజపా విజయం సాధిస్తుందనే ధీమా వ్యక్తం చేశారు.
‘తృణమూల్ కాంగ్రెస్పై బెంగాల్ ప్రజలు ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారో మమతా బెనర్జీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రాష్ట్రంలో అవినీతి పరాకాష్ఠకు చేరింది. శాంతి భద్రతల పరిస్థితి కూడా పూర్తిగా దిగజారింది. గత పదేళ్ల దీదీ పాలనతో బెంగాల్ ప్రజలు విసిగిపోయారు’ అని ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోకి చొరబాట్లను, సీఏఏ వ్యతిరేక శక్తులను అడ్డుకోవడంలో మమతా బెనర్జీ విఫలమయ్యారని అన్నారు.
పోలింగ్ సమయంలో కేంద్ర బలగాలపై మమతా బెనర్జీ చేసిన ఆరోపణలను అమిత్ షా తీవ్రంగా తప్పుబట్టారు. బలగాలపై ఎదురుదాడికి దిగాలని ఓటర్లను రెచ్చగొడుతున్నారని.. ఎన్నికల్లో ఓటమి తప్పదని భావించిన కారణంగానే ఈ ఆరోపణలు చేస్తున్నారని అమిత్ షా మండిపడ్డారు. ఈ సందర్భంగా అరాచకానికి పాల్పడాలని బెంగాల్ ప్రజలను పురిగొల్పుతున్నారా? అని మమతా బెనర్జీని ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్లో పోలింగ్ సమయంలో జరుగుతోన్న హింసను ముఖ్యమంత్రి ఖండించకపోవడం విడ్డూరమని దుయ్యబట్టారు. మైనారిటీ ఓటర్లు దూరమవుతున్నారనే భయంతోనే మమతా బెనర్జీ.. ఆ ఓటర్లకు పదేపదే తృణమూల్ కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారని విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!