కోచ్బిహార్ ఘటన ‘మారణహోమమే’: దీదీ
పశ్చిమబెంగాల్లోని కోచ్బిహార్లో శనివారం నాలుగో దశ ఎన్నికల పోలింగ్ సందర్భంగా చోటుచేసుకున్న కాల్పుల్ని సీఎం మమతా బెనర్జీ మారణహోమంగా పేర్కొన్నారు.
కోల్కతా: పశ్చిమబెంగాల్లోని కోచ్బిహార్లో శనివారం నాలుగో దశ ఎన్నికల పోలింగ్ సందర్భంగా చోటుచేసుకున్న కాల్పుల్ని సీఎం మమతా బెనర్జీ మారణహోమంగా పేర్కొన్నారు. అంతేకాకుండా బాధిత కుటుంబాలను కలిసేందుకు రాజకీయ నేతలు వెళ్లకుండా ఈసీ ఆదేశించడంపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు దీదీ ఆదివారం సిలిగురిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె దేశంలో అసమర్థ ప్రభుత్వం నెలకొందంటూ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు.
సీఐఎస్ఎఫ్ సిబ్బంది కేంద్ర పరిశ్రమల పరిరక్షణ అంశానికి సంబంధించిన వారని.. అల్లర్లను అదుపుచేసే విషయంలో వారికి అనుభవం ఉండదని దీదీ పేర్కొన్నారు. ‘అల్లర్లు చోటుచేసుకున్నపుడు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. ముందుగా లాఠీఛార్జి చేయడం, లేదా టియర్ గ్యాస్, జలఫిరంగులు ప్రయోగించాలి. అదీ కుదరకపోతే అప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలకు పోవాలి. కానీ నిన్న కోచ్బెహర్లో సీఐఎస్ఎఫ్ జరిపిన కాల్పుల్లో మరణించిన బాధితులకు మెడ, ఛాతి భాగాల్లో బుల్లెట్లు దిగాయి’ అని మమతా పేర్కొన్నారు.
‘భద్రతా బలగాల కాల్పుల్లో మరణించిన బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు నేను ఈరోజు అక్కడికి వెళ్లాలనుకున్నా. కానీ ఆ ప్రాంతంలోకి రాజకీయ నాయకుల ప్రవేశాన్ని నిషేధిస్తూ ఎన్నికల సంఘం ఆదేశించింది. రాష్ట్రంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసీసీ) కాస్తా.. మోదీ కోడ్ ఆఫ్ కండక్ట్గా మారింది’ అని మమతా విమర్శలు చేశారు.
బెంగాల్లో శనివారం నాలుగో దశ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కోచ్బిహార్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. సీతల్కూచి 126 పోలింగ్ కేంద్రం వద్ద భద్రతా దళాలు కాల్పులు జరపగా నలుగురు మృతి చెందారు. అల్లర్ల సమయంలో గ్రామస్థులు సీఐఎస్ఎఫ్ సిబ్బంది నుంచి ఆయుధాలు లాక్కునే ప్రయత్నం చేశారు. అందుకే ఆత్మరక్షణలో భాగంగా సీఐఎస్ఎఫ్ సిబ్బంది కాల్పులు జరిపారని ప్రత్యేక పోలీసు అధికారి వివేక్ దూబే తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం రేవంత్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారు: డీకే అరుణ
సీఎం రేవంత్రెడ్డి స్థాయి మరిచి తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
భూ హక్కు చట్టంతో రైతులకు తీవ్ర నష్టం
భూ హక్కు చట్టం అమలుతో రైతులు, గిరిజనులు తీవ్రంగా నష్టపోతారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. విజయవాడలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. -
జనసేన ప్రచార ప్రధాన కార్యదర్శిగా ఏఎం రత్నం
జనసేన పార్టీ ఎన్నికల ప్రచార ప్రధాన కార్యదర్శిగా ప్రముఖ నిర్మాత ఏఎం రత్నంను పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ నియమించారు. తిరుపతి నియోజకవర్గంపై ప్రత్యేకదృష్టి పెట్టాలని ఆయనకు సూచించారు. -
సీఎఫ్డీ ‘ఏపీ ఎలక్షన్ వాచ్’ వెబ్సైట్ ఆవిష్కరణ
శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు వీలుగా సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో www.apelectionwatch.com పేరుతో ఓ వెబ్సైట్ను ఆవిష్కరించినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. -
‘నిజం మాట్లాడితే నోటీసులిస్తారా?’
సీఎం జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తే చంద్రబాబు, లోకేశ్పై కేసులు పెడతారా? అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
6 వేల మంది రైతుల ఆత్మహత్యలకు జగన్రెడ్డే కారణం
వైకాపా ప్రభుత్వ వ్యవసాయ వ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో ఆరు వేల మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారని ఎన్డీయే నేతలు ధ్వజమెత్తారు. ఈ ఆత్మహత్యలకు జగన్రెడ్డే కారణమని ఆరోపించారు. -
క్యాంపస్లలో వేధింపుల పరిష్కారానికి.. రోహిత్ వేముల చట్టం చేస్తాం: కేసీ వేణుగోపాల్
హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల 2016లో మృతి చెందిన ఘటనపై గతంలో నిర్వహించిన దర్యాప్తులో అనేక వైరుధ్యాలున్నాయని.. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం ఆయన కుటుంబానికి న్యాయం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆదివారం తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు
-
‘అమ్ముడుపోయే’ ఎమ్మెల్యేలు ప్రజా ద్రోహులు : హిమాచల్ సీఎం
-
గుడ్న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
రైతు భరోసా నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం