Nara Lokesh: తెదేపాలో చేరిన ఎమ్మెల్సీ రఘురాజు సతీమణి
శృంగవరపుకోటకు చెందిన వైకాపా నేతలు భారీగా తెలుగుదేశం పార్టీలో చేరారు.
ఉండవల్లి: శృంగవరపుకోటకు చెందిన వైకాపా నేతలు భారీగా తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు భార్య సుధారాణి సహా 150 మంది తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. వీరిలో 15 మంది సర్పంచులు, 17 మంది ఎంపీటీసీలు ఉన్నారు. విధ్వంస పాలనతో ప్రజల ఆశలకు సీఎం జగన్ గండికొట్టారని లోకేశ్ ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్రకు పూర్వవైభవం తెస్తామని స్పష్టం చేశారు.
జగన్ ఒంటెద్దు పోకడలు భరించలేక జిల్లాల్లో వైకాపా పార్టీ ఖాళీ అవుతోందని లోకేశ్ అన్నారు. ఆ పార్టీలో ఇమడలేమంటున్న నాయకులు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం తెదేపాతో కలిసి పనిచేయాలనుకునే వారికి తలుపులు తెరిచే ఉంటాయన్నారు. మరోవైపు, వచ్చే ఎన్నికల్లో ఆరునూరైనా వైకాపా దారుణ పరాజయాన్ని ఎవరూ ఆపలేరని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కుండబద్దలు కొట్టారని లోకేశ్ ట్వీట్ చేశారు. జగన్ పని ఎప్పుడో అయిపోయిందని జనం చెప్పేశారన్నారు. అందుకే మునిగిపోయే వైకాపా పడవ నుంచి తమను తాము రక్షించుకునేందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలు దూకేస్తున్నారని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో శనివారం అర్ధరాత్రి వైకాపా నేతలు దౌర్జన్యం చేశారు. -
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ను వదిలి వెళ్లిన దేవెగౌడ మనవడు..!
-
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్