‘‘ప్రజలను భయపెడితే కఠినంగా వ్యవహరిస్తాం’’

ప్రజారోగ్యం పట్ల ఏపీ ప్రభుత్వం పూర్తి అవగాహన, బాధ్యతతో ఉందని మంత్రి కొడాలి నాని అన్నారు.

Updated : 08 May 2021 16:12 IST

మంత్రి కొడాలి నాని

అమరావతి: ప్రజారోగ్యం పట్ల ఏపీ ప్రభుత్వం పూర్తి అవగాహన, బాధ్యతతో ఉందని మంత్రి కొడాలి నాని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేస్తున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పరిమితి మేరకే కరోనా టీకాలు అందుబాటులో ఉంచిందని వివరించారు. టీకాల కోసం రూ.1,600 కోట్లు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమని వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీలు టీకాలు తెప్పిస్తే 10 లక్షల డోసులు వేయించేందుకు సిద్ధం అని మంత్రి అన్నారు. చంద్రబాబు, ఇతర నాయకుల రాజకీయ విమర్శలు సరికాదు అని మండిపడ్డారు. 

కర్నూలు జిల్లా నుంచి ప్రమాదకరమైన వైరస్‌ వ్యాప్తి అంటూ భయపెడుతున్నారని మంత్రి అన్నారు. ప్రజలను భయపెట్టేలా ఎవరు వ్యవహరించినా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. తెదేపా జూమ్‌ మీటింగ్‌లపైనా నిఘా సంస్థలు కన్ను వేయాలని కోరుతున్నానన్నారు. టీకాల కోసం కంపెనీలు, కేంద్రానికి ఇప్పటికే లేఖలు రాశామని మంత్రి స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని