దీదీ.. వాళ్లని అదుపులో పెట్టండి: మోదీ హెచ్చరిక
పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ భాజపా నేతలను ‘బయటి వ్యక్తులు’గా పేర్కొన్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై ప్రధాని మోదీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
సోనార్పూర్: పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ శనివారం దక్షిణ 24 పరగణాలు జిల్లాలోని సోనార్పూర్ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ భాజపా నేతలను ‘బయటి వ్యక్తులు’గా పేర్కొన్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీఎంసీని డబ్బు దోచుకొనే కంపెనీగా ఆయన అభివర్ణించారు. తృణమూల్ కాంగ్రెస్ గూండాలను అదుపులో పెట్టుకోవాలని మమతకు సూచించారు. ‘‘మోదీ ఇక్కడే ఉన్నారని ఆ గూండాలకు చెప్పండి.. ఇక బెదిరింపులను క్షమించేది లేదు’’ అని ప్రధాని హెచ్చరించారు.
‘‘బెంగాల్కు కావాల్సింది హింస, భయం కాదు. ఇక్కడి బాలికలకు విద్య కావాలి. భద్రత కావాలి. తల్లులకు గౌరవం కావాలి. న్యాయం దక్కాలి’’ అని మోదీ అన్నారు.
దీదీ వ్యాఖ్యలు దేశ సమగ్రతను నినదించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ను, భారత రాజ్యాంగ సూత్రాలను అవమానించడమేనన్నారు. బ్రిటిష్ వాళ్లు మనల్ని విభజించే ప్రయత్నం చేసినప్పుడు ‘‘భారత్ ఒక్కటే.. ప్రతి భారతీయుడి ఆశలు, ఆశయాలూ ఒక్కటే’’ అంటూ నేతాజీ చెప్పిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రధాని గుర్తు చేశారు. కానీ ఈరోజు నేతాజీ భావ జాలాన్ని ప్రచారం చేయడానికి బదులు, అందుకు విరుద్ధంగా మమత వ్యాఖ్యలు చేస్తుండటం బాధను కలిగిస్తోందన్నారు. దీదీ ‘బయటి వ్యక్తులు’ అని మాట్లాడుతున్నారనీ, కానీ మనమంతా భరతమాత బిడ్డలమేనన్నారు. ఏ భారతీయుడూ బయటివాడు కాదని చెప్పారు. మే 2 తర్వాత రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, బెంగాల్ భూమి పుత్రుడైన స్థానిక వ్యక్తినే ముఖ్యమంత్రిని చేస్తామని పునరుద్ఘాటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయం
వివేకాను జగన్మోహన్రెడ్డే హత్య చేయించారని, మాకంటే ముందు ఆయనే తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయమని ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి అభిప్రాయపడ్డారు. -
బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాంను ప్రజలు మరచిపోలేదు
మంత్రి బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాం గురించి ప్రజలు ఇంకా మరచిపోలేదని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ప్రధాని మోదీని ఉద్దేశించి బొత్స చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. -
తెలంగాణలో ధరణి.. ఏపీలో ల్యాండ్ చట్టం ఒక్కటే
తెలంగాణలో ధరణి చట్టం తీసుకొచ్చిన భారాస ఓడిపోయిందని, ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన జగన్కూ పరాభవం తప్పదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. -
పోలింగ్కు ముందు పథకాల సొమ్ము జమ చేయాలని కుట్రలు
ఎన్నికలకు ఒకటిరెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వ పథకాల సొమ్మును జమ చేయడం ద్వారా వారిని ప్రలోభపెట్టాలని వైకాపా ప్రభుత్వం కుట్రలు చూస్తోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఎవరికివారు నష్టం చేకూర్చుకున్నట్టే
‘ప్రభుత్వాలు తీసుకొచ్చిన విధానాలు సరైనవి కాకపోతే.. అభివృద్ధి, సంక్షేమం, సాధికారికత ఇవేవీ సాధ్యం కావు. -
జేజేపీలో ముసలం!
హరియాణాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. భాజపా సర్కారును పడగొట్టాలని చూస్తున్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి సొంతపార్టీ ఎమ్మెల్యేల నుంచే ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు సమాచారం. -
ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణ
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఓడితే గుజరాత్ ఇంటికే.. చెన్నై గెలిస్తే ముందుకే!
-
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ
-
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసులో ట్విస్ట్..!
-
రూ.10లక్షలిచ్చి ఖాళీ పేపర్ పెట్టండి.. మేం రాసిపెడతాం: నీట్ పరీక్షలో ఓ టీచర్ నిర్వాకం
-
తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్త
-
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్