జగన్‌కు రఘురామకృష్ణరాజు లేఖ

అయోధ్యలో రామాలయం నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆగస్టు 5న చేయనున్న భూమిపూజ భారత దేశ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు...

Published : 31 Jul 2020 11:23 IST

దిల్లీ: అయోధ్యలో రామాలయం నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆగస్టు 5న చేయనున్న భూమిపూజ భారత దేశ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.

‘‘కోట్లాది ప్రజల చిరకాలవాంఛ అయోధ్యలో రామాలయం నిర్మాణం. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమిపూజ జరిగే  రోజు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలి.  దేవాదాయశాఖ పరిధిలోని 24వేల దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, వేద పఠనం చేయాలి. భూమిపూజ కార్యక్రమాన్ని తితిదే ఆధ్వర్యంలోని ఎస్వీబీసీ ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయాలి’’ ఈమేరకు దేవాదాయశాఖను సీఎం జగన్‌ ఆదేశించాలని కోరుతూ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని