Nara Lokesh: జగన్కు ఆనాడే చెప్పా.. తగ్గేదే లేదని..: నారా లోకేశ్
తమ ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులతో గృహ ప్రవేశం చేయిస్తామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు.
పుట్టపర్తి, కదిరి: తమ ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులతో గృహ ప్రవేశం చేయిస్తామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి, కదిరిలో నిర్వహించిన ‘శంఖారావం’ సభల్లో ఆయన మాట్లాడారు. తెదేపా బలం కార్యకర్తలని.. నాయకులు పార్టీ మారి వెళ్లినా పార్టీకి అండగా నిలబడేది వారేనని అన్నారు.
‘‘వైకాపా నాయకులు, కార్యకర్తలకు భూంభూం, ప్రెసిడెంట్ మెడల్ కావాలేమో.. తెదేపా కార్యకర్తలు మాత్రం పార్టీ అధ్యక్షుడి పిలుపు ‘రా.. కదలిరా’ అంటే తరలివస్తారు. 2014లో కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రమాదంలో చనిపోయిన ప్రతి కార్యకర్త కుటుంబానికి రూ.2 లక్షలు ఇస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికి రూ.100 కోట్లు ఖర్చు పెట్టాం. పలువురు కార్యకర్తల పిల్లల్ని నా తల్లి నారా భువనేశ్వరి దత్తత తీసుకుని చదివిస్తున్నారు. నాకు అక్కా చెల్లెళ్లు, అన్నదమ్ములు లేరు.. కానీ ఎన్టీఆర్ నాకు 60 లక్షల మంది అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములను ఇచ్చారు.
తెదేపా నేతలు, కార్యకర్తలపై 2019 నుంచి 2024 వరకు అనేక అక్రమ కేసులు పెట్టారు. నాపైనా 22 కేసులు నమోదు చేశారు. జగన్కు ఆనాడే చెప్పా తగ్గేదే లేదని. చట్టాలను ఉల్లంఘించిన అధికారుల పేర్లు, వైకాపా నాయకుల పేర్లు రెడ్బుక్లో ఉన్నాయి. మేం ప్రజాధనాన్ని లూటీ చేయలేదు, మాయమాటలు చెప్పి అధికారంలోకి రాలేదు, పరదాలు కట్టుకుని తిరిగే వ్యక్తులం కాదు. గతంలో చంద్రబాబును అరెస్టు చేస్తే మొదట ఫోన్ చేసిన వ్యక్తి పవన్ కల్యాణ్. ఆయన ఒక అన్నగా నిలబడతానని నాకు చెప్పారు. ఆరోజు విమానంలో రావాలంటే అతనికి అనుమతి ఇవ్వలేదు. రోడ్డు మార్గంలో వస్తే అడ్డుకున్నారు. వైకాపా అరాచకాలు, ప్రజలపై వేధింపులు చూసి తట్టుకోలేకే పవన్ తెదేపాతో కలిసి వైకాపాను ఓడించాలని నిర్ణయించుకున్నారు’’ అని లోకేశ్ అన్నారు.
జగన్.. బీసీలకు ఏం చేశారు?
కదిరి సభలో లోకేశ్ మాట్లాడుతూ వైకాపా పాలనలో 26 వేల మంది బీసీలపై అక్రమ కేసులు పెట్టారని.. 300 మందిని హత్య చేశారని ఆరోపించారు. ‘‘ఐదేళ్లుగా బీసీలకు ఏం చేశారో జగన్ చెప్పాలి. వాళ్లకు రావాల్సిన 30 సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారు. బీసీ సబ్ప్లాన్ నిధులను వైకాపా ప్రభుత్వం పక్కదారి పట్టించింది. మేం అధికారంలోకి వచ్చాక బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. సబ్ప్లాన్ కింద ఐదేళ్లలో రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు పెడతాం. ఆదరణ పథకం కింద రూ.5 వేల కోట్లు ఖర్చు పెట్టి పనిముట్లు అందిస్తాం’’ అని నారా లోకేశ్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. -
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు -
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్