Nara Bhuvaneshwari: భవిష్యత్‌ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి

వినాశక వైకాపా ప్రభుత్వం..రాజధాని అమరావతి, అన్నా క్యాంటీన్లు సహా ప్రజల కోసం చంద్రబాబు తీసుకొచ్చిన ప్రతి ఒక్కటీ విధ్వంసం చేసిందని నారా భువనేశ్వరి మండిపడ్డారు.

Published : 28 Mar 2024 19:00 IST

గుడివాడ: వినాశక వైకాపా ప్రభుత్వం.. రాజధాని అమరావతి, అన్నా క్యాంటీన్లు సహా ప్రజల కోసం చంద్రబాబు తీసుకొచ్చిన ప్రతి ఒక్కటీ విధ్వంసం చేసిందని నారా భువనేశ్వరి మండిపడ్డారు. కృష్ణా జిల్లా గుడివాడలో నిజం గెలవాలి యాత్రలో పాల్గొన్న ఆమెకు ప్రజలు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. చంద్రబాబు అరెస్టుతో మోటూరు గ్రామంలో మృతి చెందిన  యార్లగడ్డ శ్రీనివాసరావు, అడుసుమిల్లి శశికళ కుటుంబాలను పరామర్శించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భవిష్యత్తు తరాల బాగు కోసం ప్రతి ఒక్కరూ తమ తోటి వారితో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయించాలని పిలుపునిచ్చారు. తన తండ్రి ఎన్టీఆర్‌ను గెలిపించి సీఎంను చేసింది.. గుడివాడ ప్రజలేనని గుర్తు చేశారు. ఎన్టీఆర్‌ ప్రజాసేవ కోసం తపించినట్లే.. చంద్రబాబు తపిస్తారని తెలిపారు. ఎన్టీఆర్‌ పేరుతో చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా 360 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి ఏడున్నర కోట్ల మంది ఆకలి తీర్చారని చెప్పారు. ఆ తర్వాత నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో బెజవాడ రామారావు, నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలో వెనిగళ్ల పూర్ణచంద్రరావు కుటుంబాలను పరామర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని