Mamata-Nitish Meet: భాజపా జీరో కావడమే కోరిక..! నీతీశ్తో దీదీ భేటీ
తృణమూల్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో (Mamata Banerjee) సమావేశమైన బిహార్ సీఎం నీతీశ్ కుమార్ (Nitish Kumar) విపక్షాల ఐక్యతపై చర్చించారు.
కోల్కతా: విపక్షాల ఐక్యత (Opposition Unity) కోసం జరుగుతోన్న ప్రయత్నాల్లో మరో ముందడుగు చోటుచేసుకుంది. దీనిపై ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ అధినేతలు సమావేశమవుతోన్న వేళ బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ (Nitish Kumar).. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో (Mamata Banerjee) భేటీ అయ్యారు. ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్తో కలిసి కోల్కతా వెళ్లిన ఆయన.. దీదీతో సమావేశమై విపక్షాల ఐక్యత విషయంపై చర్చించారు. అనంతరం మాట్లాడిన మమతా బెనర్జీ.. వచ్చే ఎన్నికల్లో భాజపాను ఎదుర్కొనేందుకు భావసారూప్యత కలిగిన విపక్ష పార్టీలన్నీ ఒకేతాటిపై వచ్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని తాను గతంలోనూ చెప్పానని వెల్లడించారు.
‘నీతీశ్కు ఓ విన్నపం చేశాను. లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ పోరాటం బిహార్ నుంచే మొదలయ్యింది. అలాగే బిహార్లో అఖిలపక్ష సమావేశం నిర్వహించి.. తదుపరి కార్యాచరణపై ఓ నిర్ణయం తీసుకోవచ్చు. అంతకుముందు మనమందరం కలిసే ఉన్నామనే సందేశం ఇవ్వాలి. మాకు వ్యక్తిగత భేషజాలు లేవు. భాజపా జీరో కావడమే నేను కోరుకునేది. తప్పుడు వార్తలు, అబద్ధాలతో వారు (భాజపా) హీరోగా చెలరేగిపోతున్నారు’ అని మమతా బెనర్జీ పేర్కొన్నారు.
‘సమావేశంలో సానుకూల చర్చ జరిగింది. ముఖ్యంగా వచ్చే పార్లమెంటు ఎన్నికలకు ముందు అన్ని పార్టీలు ఏకమయ్యే విషయమై చర్చించాం. విపక్షాలన్నీ కూర్చొని వ్యూహాన్ని రచించాల్సిన అవసరం ఉంది’ అని నీతీశ్ కుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా కేంద్రం తీరుపై మండిపడ్డ ఆయన.. దేశాభివృద్ధికి భాజపా ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. కేవలం వారు సొంత ప్రచారం మాత్రమే చేసుకుంటున్నారని విమర్శించారు. ఇదిలాఉంటే, విపక్షాల ఐక్యతకు సంబంధించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో నీతీశ్ కుమార్ భేటీ అయిన విషయం తెలిసిందే. అంతకుముందు ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్తోనూ సమావేశమైన మమతా బెనర్జీ.. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్తోనూ ఇటీవల చర్చలు జరిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!