Arvind: కేసీఆర్‌ను ఓటమి భయం వెంటాడుతోంది: అర్వింద్‌

భారాస, ఎంఐఎం దోస్తీతో మైనార్టీలకే నష్టమని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌  అన్నారు.

Updated : 22 Aug 2023 19:00 IST

నిజామాబాద్‌: గజ్వేల్‌లో ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్‌ (CM KCR) కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ (Dharmapuri Arvind) ఆరోపించారు. నిజామాబాద్‌లో ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యారు. భారాస, ఎంఐఎం దోస్తీతో మైనార్టీలకే నష్టమన్నారు. మోదీ పాలనతో ముస్లింలకు భద్రత కలిగిందని, భాజపాకి వాళ్ల ఓటింగ్‌ కూడా పెరుగుతుందని అన్నారు. భాజపాకి ఓటు వద్దనుకుంటే నోటాకు వేయాలని సూచించారు. ముస్లింలను కేసీఆర్‌ ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని విమర్శించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని