Maharashtra Crisis: మహా సంక్షోభం వెనుక భాజపా హస్తం.. ఆ పార్టీ చీఫ్ ఏమన్నారంటే?
ఏక్నాథ్ శిందే సహా పలువురు శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటు వెనుక భాజపా హస్తం ఉందంటూ వస్తున్న ఆరోపణలను ఆ పార్టీ మహారాష్ట్ర చీఫ్ చంద్రకాంత్ పాటిల్ తోసిపుచ్చారు....
ముంబయి: ఏక్నాథ్ శిందే సహా పలువురు శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటు వెనుక భాజపా హస్తం ఉందంటూ వస్తోన్న ఆరోపణలను ఆ పార్టీ మహారాష్ట్ర చీఫ్ చంద్రకాంత్ పాటిల్ తోసిపుచ్చారు. తాజాగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభంలో తమ పార్టీ పాత్రేమీ లేదని తెలిపారు. అయితే, వేరే పని నిమిత్తం ఇటీవల తమ నేత, శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడణవీస్ దిల్లీకి వెళ్లినట్లు ధ్రువీకరించారు. ఈ పర్యటనకు సంబంధించి ఆయన ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ ఆఘాడీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా ప్రయత్నిస్తోందని ఇటీవల ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా చంద్రకాంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ప్రస్తుతం ఏక్నాథ్ శిందే సహా పలువురు శివసేన, స్వతంత్ర ఎమ్మెల్యేలు గువాహటిలోని హోటల్లో బస చేస్తున్నారు. తనకు మొత్తం 50 మంది శాసనసభ్యుల మద్దతు ఉందని ఏక్నాథ్ శిందే శుక్రవారం ఉదయం తెలిపారు. వీరిలో 40 మంది శివసేనకు చెందినవారన్నారు.
శివసేన పార్టీలో వచ్చిన ఈ అంతర్గత సంక్షోభంతో తమకు ఎలాంటి సంబంధం లేదని చంద్రకాంత్ పాటిల్ అన్నారు. గురువారం మధ్యాహ్నం ఫడణవీస్తో కలిసి తాను మధ్యాహ్న భోజనం చేశానన్నారు. తర్వాత ఆయన దిల్లీ బయలుదేరి వెళ్లారన్నారు. అయితే, ఆ సమయంలో ఫడణవీస్ తనతో తాజా సంక్షోభంపై పెద్దగా చర్చించలేదన్నారు. ఏదైనా ఉంటే తన నిర్ణయాన్ని కచ్చితంగా పరిగణనలోకి తీసుకునే ముందుకు వెళతారన్నారు.
తాజా పరిణామాలకు భాజపాను నిందించడంపై స్పందిస్తూ.. శరద్ పవార్, శివసేనకు చెందిన సంజయ్ రౌత్ పరిధిని దాటి తమ వాక్ స్వాతంత్ర్యాన్ని ఉపయోగించుకుంటున్నారని పాటిల్ వ్యాఖ్యానించారు. అసలు శివసేన పార్టీలో ఏం జరుగుతుందో కూడా తాను పెద్దగా పట్టించుకోవట్లేదన్నారు. భాజపాకు చెందిన మోహిత్ కాంబోజ్ కూడా రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి గువాహటిలో ఉన్నారంటూ వస్తున్న వార్తలపైనా పాటిల్ స్పందించారు. మోహిత్కు పార్టీలకతీతంగా మిత్రులున్నారన్నారు. బహుశా ఎవరికైనా సాయం చేయడానికి ఆయన అక్కడికి వెళ్లి ఉంటారన్నారు. ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారనే విషయంపై తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక