సొంతగూటికి మాజీ సీఎం.. కాంగ్రెస్లో చేరిన గిరిధర్ గమాంగ్
Giridhar Gamang: ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ 9 ఏళ్ల తర్వాత మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతకుముందు భాజపా, భారాసలో కొన్నాళ్ల పాటు ఉన్నారు.
దిల్లీ: ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ తిరిగి కాంగ్రెస్లో చేరారు. 9 ఏళ్ల క్రితం పార్టీని వీడిన ఆయన.. తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ ట్రెజరర్ అజయ్ మాకెన్ సమక్షంలో బుధవారం పార్టీ కండువా కప్పుకొన్నారు. ఆయనతో పాటు ఆయన భార్య హేమ గమాంగ్, కుమారుడు శిశిర్ గమాంగ్, భాజపా నేత, మాజీ ఎంపీ సంజయ్ భోయ్ ఉన్నారు. దేశంలో బాధ్యతాయుతమైన రాజకీయాలు చేసే పార్టీ ఒక్క కాంగ్రెసేనని పేర్కొన్నారు.
1972లో కొరాపుట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గమాంగ్ లోక్సభకు తొలిసారి ఎన్నికయ్యారు. తర్వాత వరుసగా ఎనిమిది సార్లు ఎంపీగా గెలిచారు. ఎంపీగా ఉంటూనే 1999 ఫిబ్రవరి 17 నుంచి డిసెంబరు 6 వరకు ఒడిశా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ ఏడాది ఏప్రిల్ 17న కేంద్రంలోని వాజ్పేయీ ప్రభుత్వంపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా.. గమాంగ్ వ్యతిరేకంగా ఓటు వేయడంతో ఆ సర్కారు కూలిపోయింది. 2009 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత గమాంగ్ కాంగ్రెస్కు దూరమయ్యారు. 2015లో భాజపాలో చేరిన ఆయన కొన్నాళ్లకు ఆ పార్టీకి రాజీనామా చేశారు. 2023 జనవరిలో భారాసలో చేరిన ఆయన ఆ పార్టీకీ గుడ్బై చెప్పారు. మళ్లీ కాంగ్రెస్లో చేరారు. గమాంగ్ ఒడిశా సీఎంగా ఉన్న సమయంలోనే ఆయన భార్య హేమ గమాంగ్ కొరాపుట్ నుంచి 1999లో లోక్సభకు ప్రాతినిథ్యం వహించారు. తాను పార్టీని వీడినా కాంగ్రెస్ ఆలోచనలు, సిద్ధాంతాలను వీడలేదని ఈ సందర్భంగా చెప్పడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూ హక్కు చట్టంతో రైతులకు తీవ్ర నష్టం
భూ హక్కు చట్టం అమలుతో రైతులు, గిరిజనులు తీవ్రంగా నష్టపోతారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. విజయవాడలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. -
జనసేన ప్రచార ప్రధాన కార్యదర్శిగా ఏఎం రత్నం
జనసేన పార్టీ ఎన్నికల ప్రచార ప్రధాన కార్యదర్శిగా ప్రముఖ నిర్మాత ఏఎం రత్నంను పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ నియమించారు. తిరుపతి నియోజకవర్గంపై ప్రత్యేకదృష్టి పెట్టాలని ఆయనకు సూచించారు. -
సీఎఫ్డీ ‘ఏపీ ఎలక్షన్ వాచ్’ వెబ్సైట్ ఆవిష్కరణ
శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు వీలుగా సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో www.apelectionwatch.com పేరుతో ఓ వెబ్సైట్ను ఆవిష్కరించినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. -
‘నిజం మాట్లాడితే నోటీసులిస్తారా?’
సీఎం జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తే చంద్రబాబు, లోకేశ్పై కేసులు పెడతారా? అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
6 వేల మంది రైతుల ఆత్మహత్యలకు జగన్రెడ్డే కారణం
వైకాపా ప్రభుత్వ వ్యవసాయ వ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో ఆరు వేల మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారని ఎన్డీయే నేతలు ధ్వజమెత్తారు. ఈ ఆత్మహత్యలకు జగన్రెడ్డే కారణమని ఆరోపించారు. -
క్యాంపస్లలో వేధింపుల పరిష్కారానికి.. రోహిత్ వేముల చట్టం చేస్తాం: కేసీ వేణుగోపాల్
హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల 2016లో మృతి చెందిన ఘటనపై గతంలో నిర్వహించిన దర్యాప్తులో అనేక వైరుధ్యాలున్నాయని.. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం ఆయన కుటుంబానికి న్యాయం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆదివారం తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్
-
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
-
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
-
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!
-
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా