YSRCP: సత్తెనపల్లిలో ప్రలోభాల పర్వం.. రెండో రోజు 5వేలకు పైగా చీరలు స్వాధీనం
పల్నాడు జిల్లా సత్తెనపల్లి పారిశ్రామిక వాడలోని గోదాములో వైకాపా నేతలు నిల్వ ఉంచిన వేలాది చీరలను ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లి పారిశ్రామిక వాడలోని గోదాములో వైకాపా నేతలు నిల్వ ఉంచిన వేలాది చీరలను ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీ చేసేందుకు చీరలు తీసుకొచ్చి సత్తెనపల్లిలోని గోదాములో నిల్వచేశారనే సమాచారంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. జగన్ బొమ్మ ముద్రించి ఉన్న బాక్సుల్లోని 5,472 చీరలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. బుధవారం కూడా సత్తెనపల్లిలో వైకాపా నేత, రాష్ట్ర రైతు సలహా మండలి సభ్యులు కళ్లె విజయభాస్కర్రెడ్డికి చెందిన కేవీఆర్ మార్ట్లో రెండు వేల చీరలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. వైకాపా ప్రలోభాలపై సత్తెనపల్లి నియోజకవర్గంలో విస్తృత చర్చ జరుగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి, 23 మందికి గాయాలు
-
భర్త మద్దతుగా మాట్లాడలేదని వివాహిత ఆత్మహత్య
-
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM