ఇచ్చింది రూ.50 వేలు.. లాగింది రూ.3.5 లక్షలు
డ్రైవర్ అన్నలు... నా మిత్రులు అన్నారు ఎప్పటికీ అండగా ఉంటామన్నారు... జగన్ మాటకు చేతకు పొంతన ఉండదుగా... ఏదో మొక్కుబడిగా సాయం చేశారు.
వాహనమిత్ర లబ్ధిదారులకు జగన్ సర్కారు టోపీ
గుంతల రోడ్లతో మరమ్మతులకు రూ.1.80 లక్షల అదనపు ఖర్చు
ఈనాడు, అమరావతి
డ్రైవర్ అన్నలు... నా మిత్రులు అన్నారు
ఎప్పటికీ అండగా ఉంటామన్నారు...
జగన్ మాటకు చేతకు పొంతన ఉండదుగా...
ఏదో మొక్కుబడిగా సాయం చేశారు...
ప్రతిగా ముక్కుపిండి వసూలు చేశారు...
అదే మోసం ఐదేళ్లుగా చేస్తూనే ఉన్నారు!
దాన్నే గొప్పగా చెబుతూ బాకాలూదుతున్నారు!
వాహనమిత్ర కింద జగన్ ప్రభుత్వం రాష్ట్రంలోని కొందరు డ్రైవర్లకు వాహనమిత్ర కింద ఏడాదికి రూ.10 వేల చొప్పున అయిదేళ్లలో రూ.50 వేలు ఇచ్చింది. దీనికి ప్రతిగా ప్రభుత్వం వారి నుంచి ఏడురెట్ల డబ్బులను వసూలు చేసింది. ‘‘ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు మంచి చేయాలని ఆలోచించిన ప్రభుత్వాలు దేశంలో ఎక్కడా లేవు. మన రాష్ట్రంలోనే వారికి ఆర్థిక సాయం అందిస్తున్నాం’’ అంటూ గతంలో వాహనమిత్ర సాయం అందించే సమయంలో సీఎం జగన్ వ్యాఖ్యానించారు. వీటిని వింటే జగన్ది ఎంత మంచి మనసో అనుకుంటారు. కానీ, ఆయన అసలు నైజం తెలిస్తే... డ్రైవర్లను ఇంతలా మోసం చేస్తున్నారా? అని ముక్కున వేలేసుకోవాల్సి వస్తుంది. మొత్తానికి వైకాపా ప్రభుత్వం... నిత్యం ఆటో నడిపితేగానీ కుటుంబాలను పోషించుకోలేని డ్రైవర్లను కూడా విడిచి పెట్టలేదు.
అనర్హుల పేరిట వడపోత
సొంత ఆటో, ట్యాక్సీ నడిపే వారికి వాహనాల ఇన్సూరెన్స్, ఫిట్నెస్, రిపేర్లు తదితరాలకు ఏటా రూ.10 వేల చొప్పున వాహనమిత్ర సాయం అందిస్తానని జగన్ గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు, ట్యాక్సీలు, మ్యాక్సీ క్యాబ్లు 7.5 లక్షల వరకు ఉండగా... వైకాపా ప్రభుత్వం ఏటా సగటున 2.60 లక్షల మందికే సాయం అందించింది. సొంత ఆటో/ట్యాక్సీ కలిగి ఉండి, దాన్ని నడిపే వారికే అనే నిబంధన కారణంగా... మూడింట ఒక వంతు వాహనాల డ్రైవర్లకే సాయం దక్కింది. రాష్ట్రంలో చాలామంది డ్రైవర్లు నిత్యం ఆటోలను అద్దెకు తీసుకొని నడుపుతుంటారు. ఇలాంటి వారికి సాయం అందలేదు. పైగా... విద్యుత్ వినియోగం నెలకు సగటున 300 యూనిట్లు దాటకూడదని, మూడెకరాల్లోపు మాగాణి, పదెకరాల్లోనే మెట్ట భూమి ఉండాలని, మున్సిపాలిటీ పరిధిలో వెయ్యి చదరపు అడుగులకు మించిన స్థలంలో నిర్మాణం ఉండకూడదని, కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి, పింఛనుదారు ఉండకూడదనే.. షరతుల కారణంగా లక్షల మంది డ్రైవర్లకు పథకం వర్తించలేదు.
డీజిల్ భారమే అత్యధికం
పొరుగు రాష్ట్రాల్లో డీజిల్ ధర మనకంటే చాలా తక్కువ. కర్ణాటకలో లీటర్పై రూ.11, తమిళనాడులో రూ.5, ఒడిశాలో రూ.3.50 తక్కువగా ఉంది. కర్ణాటక ధరను పరిగణనలోకి తీసుకుంటే... ఆటో డ్రైవర్ ప్రతి లీటర్పై ప్రభుత్వానికి అదనంగా రూ.11 చెల్లిస్తున్నారు. ఒక డ్రైవర్ రోజుకు సగటున 10 లీటర్ల డీజిల్ వినియోగిస్తారు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నిత్యం రూ.110, నెలకు రూ.3,300, ఏడాదికి సుమారు రూ.40 వేల చొప్పున అయిదేళ్లకు రూ.2 లక్షల మేర జగన్ ప్రభుత్వానికి కప్పం కట్టారు.
ఆటోల మరమ్మతులకే రూ.1.80 లక్షలు
జగన్ అయిదేళ్ల పాలనలో రోడ్లు అత్యంత అధ్వానంగా తయారయ్యాయి. ముఖ్యంగా గ్రామాలకు వెళ్లే రోడ్ల గురించి ఎంత తక్కువ చెబితే, అంత మంచిది. ఇటువంటి వాటిపై ఆటోలు నడుపుతుంటే... తరచూ పాడవుతున్నాయి. ఆటోల వెనుక చక్రాల బేరింగ్స్ దెబ్బతింటున్నాయి. మూడేళ్లపాటు మన్నాల్సిన క్లచ్పేట్లు ఏడాదికే పాడవుతున్నాయి. గుంతల్లో పడి టైర్లు త్వరగా దెబ్బతినడంతో 40 వేల కి.మీ. రావాల్సిన టైర్ల జీవితకాలం.. 30 వేల కి.మీ.కు తగ్గిపోయింది. టైర్లకు తరచూ పంక్చర్లు పడుతున్నాయి. గతంలో లీటర్కు 30 కి.మీ. వరకు వచ్చే మైలేజ్ ఇప్పుడు 20-25 కి.మీ. వస్తోంది. గతంలో ఆటోల నిర్వహణకు నెలకు రూ.వేయి ఖర్చు అయ్యేది. అధ్వాన రోడ్ల కారణంగా నెలకు సగటున రూ.3 వేలు వెచ్చించక తప్పని పరిస్థితి వచ్చిందని డ్రైవర్లు వాపోతున్నారు. అంటే ఏడాదికి రూ.36 వేల చొప్పున, అయిదేళ్లలో రూ.1.80 లక్షలను రిపేర్లకే ధారపోశారు.
విశాఖ మద్దిలపాలెం రోడ్డులో 2023 ఆగస్టు 17న ఓ ఆటో డ్రైవర్కు రవాణా శాఖాధికారి వేసిన జరిమానా రూ.19 వేలు. బాబోయ్... నా ఆటో అమ్మేసినా అంత సొమ్మురాదని అధికారులను బాధితుడు వేడుకోగా... ఒకేసారి కాకుండా విడతల వారీగా జరిమానా సొమ్ము చెల్లించడానికి అవకాశమిచ్చారు.
రూ.3 లక్షలు ఎదురు చెల్లింపు
వాహనమిత్ర కింద ఒక్కో డ్రైవర్కు ఏడాదికి రూ.10 వేల చొప్పున అయిదేళ్లలో రూ.50 వేలను వైకాపా ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఏపీతో పోలిస్తే... కర్ణాటకలో లీటర్ డీజిల్ ధర రూ.11 తక్కువ. అదంతా జగన్ ప్రభుత్వం వసూలు చేస్తున్నదే. అలాగే ప్రతి చిన్న పొరపాటుకీ భారీ జరిమానాలతో వైకాపా ప్రభుత్వం విరుచుకుపడింది. ఇలా అధిక డీజిల్ ధర, జరిమానాల రూపంలో ఒక్కో డ్రైవర్ నుంచి అయిదేళ్లలో సగటున రూ.3.50 లక్షల మేర ప్రభుత్వం నిలువు దోపిడీ చేసింది. అందులో రూ.50 వేలను సాయంగా అందించింది. ఈ లెక్కన ఒక్కో డ్రైవరే ప్రభుత్వానికి అదనంగా రూ.3 లక్షలు ఎదురు చెల్లించినట్లు అయింది.
ప్రతి పొరపాటుకి భారీ జరిమానా
గతంలో ఆటో డ్రైవర్లు చిన్నచిన్న పొరపాట్లు చేసినా, ఏమైనా పత్రాలు లేకున్నా... రవాణా శాఖ అధికారులు, పోలీసులు నామమాత్రపు జరిమానాలు వేసేవారు. అయితే జగన్ ప్రభుత్వం భారీ జరిమానాలతో వారిని పిప్పి చేస్తోంది. వాస్తవానికి 2020లో కేంద్రం రవాణా నిబంధనల ఉల్లంఘనలకు జరిమానాలను పెంచింది. వీటిపై ఏ రాష్ట్రమూ సుముఖత వ్యక్తం చేయకున్నా... ఏపీలో అమలుకు సిద్ధమంటూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
ఫిట్నెస్ సర్టిఫికెట్, బీమా లేకుంటే రూ.2-5 వేల చొప్పున, పర్మిట్ లేకున్నా, రెన్యువల్ చేసుకోకున్నా రూ.10 వేలు, పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే రూ.3-5 వేలు, తనిఖీ సమయంలో లైసెన్స్ లేకుంటే రూ.10 వేల చొప్పున జరిమానాలు వేస్తున్నారు. ఓవర్లోడ్ ఉంటే... ఆటోలో ఎంతమంది అదనంగా ఉన్నారనే దాంతో సంబంధం లేకుండా రూ.10 వేలు జరిమానా వేస్తున్నారు. విజయవాడ, వైజాగ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఉల్లంఘనలకు పాల్పడితే రూ.300 జరిమానా విధిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శిక్ష ఎస్పీకి.. నేరం ఎవరిది?
పల్నాడులో పోలింగ్ రోజు, అనంతర హింసాకాండ నేపథ్యంలో.. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. -
రెండు రోజుల్లో రూ.4వేల కోట్ల చెల్లింపులు
పోలింగ్ ముగిసి నాలుగు రోజులైనా పేదల పథకాల సొమ్ములకు మోక్షం కలగడం లేదు. మరో వైపు ఉన్న నిధుల్లో అనుయాయ గుత్తేదారులకు చెల్లింపులు కొనసాగుతున్నాయి. -
పోస్టింగ్ ఇవ్వకుండానే పంపించే పన్నాగం!
ప్రభుత్వమే ఫ్యాక్షనిస్టుగా మారితే... గిట్టనివారిని ఏ స్థాయిలో వేధిస్తుందో, ఎంతలా కక్ష సాధిస్తుందో డీజీ ర్యాంకు కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఉదంతమే తిరుగులేని ఉదాహరణ. -
రక్తపు మడుగులో ఉన్నవారిని లంచం అడిగిన పోలీసులు!
తాము నమ్మిన పార్టీకి ఓటేస్తామని ధైర్యంగా చెప్పడమే వారు చేసిన తప్పు! వైకాపా నాయకులు డబ్బులిస్తామని ఆశ చూపినా, భయపెట్టినా వెరవక స్థిరంగా నిలవడమే మహాపరాధం!! అది విని రెచ్చిపోయిన వైకాపా రౌడీమూకలు ఇనుప రాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. -
పోలీసులు కాదు.. గులాములే
వైకాపాతో అంటకాగుతూ.. పోలింగ్ నాడు, ఆ తర్వాత పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసకు అన్ని విధాలుగా సహకరించి సస్పైండైన ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలపై ఎన్నికల సంఘం క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. -
విభాగాల విలీనంతో ప్రాధాన్యం కోల్పోతున్న వర్సిటీలు
చదువుల పెన్నిధిగా.. పరిశోధనలకు పట్టుగొమ్మలుగా విరాజిల్లాల్సిన విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో మొక్కుబడి విద్యా సంస్థలుగా మారుతున్నాయి. -
చిన్నారులను వేధిస్తున్న పోషకాహార లోపం
రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార లోపంతో బాధపడే ఐదేళ్లలోపు చిన్నారులు పెద్దసంఖ్యలో ఉన్నారు. రేపటి పౌరులను ఆరోగ్యవంతులుగా తయారు చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కేంద్రాల్లోని చిన్నారుల పరిస్థితే ఇలా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. -
గడువు ముగిసినా.. పౌర సేవలు గగనమే!
ప్రజలకు నిర్దేశిత గడువులోగా పౌర సేవలు అందించాలన్న విధానం పట్టణ స్థానిక సంస్థల్లో పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. -
వారికి ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలి
తిరుమల శ్రీవారి సన్నిధిలో ‘మేల్చాట్ వస్త్రం’ ‘తిరుప్పావడ’ సేవలకు నిర్ణీత రుసుము చెల్లించిన తర్వాత అర్ధాంతరంగా రద్దు చేసినందుకు తితిదే.. భక్తులకు ఆ సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని, లేకుంటే రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని మహబూబ్నగర్ జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు అనురాధ, సభ్యులు చంద్రశేఖర్రెడ్డి, విజయలక్ష్మి ఇటీవల తీర్పు వెలువరించారు. -
విజయనగరంలో జిందాల్ పరిశ్రమ మూసివేత
ఏపీలోని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్నపాలెంలోని మెసర్స్ జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ పరిశ్రమను సంబంధిత యాజమాన్యం మూసివేసింది. -
వేతనాల సొమ్ము తిరిగి ఇవ్వండి
ప్రభుత్వ సర్వీసులో ఉంటూ పీజీ వైద్య విద్యను పూర్తిచేసి, అయిదేళ్ల పాటు పనిచేయకుండా అనధికారికంగా సెలవులో ఉన్న 70 మంది వైద్యులు.. రూ.20 లక్షలతోపాటు చదివే సమయంలో పొందిన ప్రభుత్వ వేతనాల్ని తిరిగి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. -
కేజీహెచ్ సూపరింటెండెంట్కు అస్వస్థత.. కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స
విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రి(కేజీహెచ్) సూపరింటెండెంట్ డాక్టర్ పి.అశోక్కుమార్ గురువారం అస్వస్థతకు గురై నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
రెండో రోజు ఏపీఈఏపీసెట్కు 91.62 శాతం మంది హాజరు
జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో ఆన్లైన్లో నిర్వహించిన ఏపీఈఏపీ సెట్-2024.. రెండోరోజు రాష్ట్రంలో, హైదరాబాద్లోనూ ప్రశాంతంగా జరిగిందని సెట్ ఛైర్మన్, ఉపకులపతి జి.వి.ఆర్.ప్రసాదరాజు తెలిపారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ ప్రక్రియ వాయిదా
రాష్ట్రంలో ఈ-ఆఫీస్ అప్గ్రేడ్ ప్రక్రియను వాయిదా వేయాల్సిందిగా ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించాలన్నది ప్రభుత్వ ఆలోచన. -
రేపు అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వార్షిక కల్యాణోత్సవాన్ని ఈ నెల 19వ తేదీన నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. -
శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. దర్శనానికి దాదాపు 30 గంటలకుపైగా సమయం పడుతోంది. -
గోదావరిలో ఇసుక మా‘రీచు’లు!
ఇసుక అక్రమ తవ్వకాలను కట్టడి చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసినా గోదావరిలో అడ్డుకట్ట పడటంలేదు. భారీ యంత్రాలతో డ్రెడ్జింగ్ చేస్తున్నారు. -
ఇసుక లారీలకు టార్పాలిన్ తప్పనిసరి చేయండి
ఇసుక, ఇతర ఖనిజ సంపద రవాణా సమయంలో లారీల ద్వారా కలుగుతున్న వాయు, శబ్ద కాలుష్య నివారణ, గ్రామస్థులకు కలుగుతున్న అసౌకర్యాన్ని తొలగించేందుకు హైకోర్టు కీలక చర్యలు చేపట్టింది. -
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!
ఆమె నిండు గర్భిణి.. ఆపై పురిటి నొప్పులు.. బాధను భరించలేక తల్లడిల్లుతున్న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సరైన దారి లేదు. గ్రామానికి వాహనమొచ్చే మార్గమూ కనిపించలేదు. -
పేదింటి ఉత్తమ విద్యార్థులకు విమాన ప్రయాణం
పేద విద్యార్థుల ప్రతిభా ప్రోత్సాహక విషయంలో ఇచ్చిన మాట ప్రకారం స్పందించారు తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మాదనపాలేనికి చెందిన ఉమాపతి. -
రాబడుల్లో ఇలా మిగిలాం!
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితులు తెలంగాణతో పోలిస్తే గడిచిన ఐదేళ్లుగా మరీ దిగజారిపోయాయి. ఆ రాష్ట్రంలో సొంత రెవెన్యూ రాబడులు పెరుగుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
-
బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది సజీవ దహనం
-
మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పిన సోనాక్షి సిన్హా.. ఎందుకంటే!
-
కెమెరామన్.. ప్లీజ్ ఆడియో ఆన్ చేయొద్దు: రోహిత్ శర్మ
-
కిర్గిస్థాన్లో అల్లర్లు.. భారత విద్యార్థులకు కేంద్రం అలర్ట్
-
నేడు స్టాక్మార్కెట్ ప్రత్యేక సెషన్.. దూసుకెళ్లిన సూచీలు