Janasena: జనసేన స్టార్‌ క్యాంపెయినర్లు వీరే..

జనసేన అభ్యర్థుల తరఫున ప్రచారానికి స్టార్‌ క్యాంపెయినర్లను పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు.

Updated : 11 Apr 2024 20:19 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో జనసేన అభ్యర్థుల తరఫున ప్రచారానికి స్టార్‌ క్యాంపెయినర్లను పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు, క్రికెటర్‌ అంబటి రాయుడు, నృత్య దర్శకుడు జానీ మాస్టర్‌, సినీ నటులు సాగర్‌, పృథ్వీ, హైపర్‌ ఆది, గెటప్‌ శ్రీనులను ప్రచారకర్తలుగా నియమించారు. తెదేపా, భాజపాతో పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్‌ స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే. కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పవన్‌ కల్యాణ్ పోటీ చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు