Payyavula Keshav: ఫారం-7 గంపగుత్త అప్లికేషన్లు తీసుకోవడానికి వీల్లేదు: పయ్యావుల
ఓట్లు తొలగించేందుకు ఫారం-7 ద్వారా గంపగుత్త అప్లికేషన్లకు వీల్లేదని ఈసీ ఇచ్చిన ఆదేశాలు తాము చేస్తున్న పోరాటానికి స్పష్టత ఇచ్చినట్లు అయ్యిందని తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు.
అనంతపురం: ఓట్లు తొలగించేందుకు ఫారం-7 ద్వారా గంపగుత్త అప్లికేషన్లు తీసుకోవడానికి వీల్లేదని ఈసీ ఇచ్చిన ఆదేశాలు.. తాము చేస్తున్న పోరాటంపై స్పష్టత ఇచ్చినట్లు అయ్యిందని తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. అనంతపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పయ్యావుల మాట్లాడారు. ఓట్లు తొలగించాలని అధికారులపై వైకాపా నాయకులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని మండిపడ్డారు. ఓటు ఎక్కడ ఉండాలనేది ఓటరు హక్కు, రెండు ఓట్లు ఉంటే తప్పు అని ఆయన స్పష్టం చేశారు. ఓటమి భయంతోనే ఉరవకొండలో వైకాపా నేత విశ్వేశ్వర్ రెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ఎవడ్రా నువ్వు.. తమాషాలు చేస్తున్నావా’.. ఎంపీడీవోపై ముత్తంశెట్టి చిందులు
‘‘విశ్వేశ్వర్ రెడ్డి నీతి సూత్రాలు చెబుతుంటే ఆశ్చర్యమేస్తోంది. ఆయన జీవితమంతా బ్లాక్మెయిల్ రాజకీయాలే. టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారతానని బ్లాక్మెయిల్ చేసేవారు. నేడు స్పష్టంగా ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చింది. ఫారం-7 గంపగుత్త అప్లికేషన్లు తీసుకోవడానికి వీల్లేదు. తప్పులు కళ్ల ముందే జరుగుతుంటే పరిశీలకులు ఏం చేస్తున్నారు? మా ఫిర్యాదులపై ఏం స్పందించారో వారే చెప్పాలి. నిష్పక్షపాతంగా పనిచేస్తే మేం ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు కదా? విశ్వేశ్వర్ రెడ్డి ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయో చూపించమంటారా?’’ అని పయ్యావుల ప్రశ్నించారు. కాగా, పయ్యావుల ఫిర్యాదు మేరకు ఫారం-7 గంపగుత్తగా సమర్పించకూడదని ఉత్తర్వులు జారీ చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం కీలక ఆదేశాలు ఇచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూ హక్కు చట్టంతో రైతులకు తీవ్ర నష్టం
భూ హక్కు చట్టం అమలుతో రైతులు, గిరిజనులు తీవ్రంగా నష్టపోతారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. విజయవాడలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. -
జనసేన ప్రచార ప్రధాన కార్యదర్శిగా ఏఎం రత్నం
జనసేన పార్టీ ఎన్నికల ప్రచార ప్రధాన కార్యదర్శిగా ప్రముఖ నిర్మాత ఏఎం రత్నంను పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ నియమించారు. తిరుపతి నియోజకవర్గంపై ప్రత్యేకదృష్టి పెట్టాలని ఆయనకు సూచించారు. -
సీఎఫ్డీ ‘ఏపీ ఎలక్షన్ వాచ్’ వెబ్సైట్ ఆవిష్కరణ
శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు వీలుగా సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో www.apelectionwatch.com పేరుతో ఓ వెబ్సైట్ను ఆవిష్కరించినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. -
‘నిజం మాట్లాడితే నోటీసులిస్తారా?’
సీఎం జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తే చంద్రబాబు, లోకేశ్పై కేసులు పెడతారా? అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
6 వేల మంది రైతుల ఆత్మహత్యలకు జగన్రెడ్డే కారణం
వైకాపా ప్రభుత్వ వ్యవసాయ వ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో ఆరు వేల మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారని ఎన్డీయే నేతలు ధ్వజమెత్తారు. ఈ ఆత్మహత్యలకు జగన్రెడ్డే కారణమని ఆరోపించారు. -
క్యాంపస్లలో వేధింపుల పరిష్కారానికి.. రోహిత్ వేముల చట్టం చేస్తాం: కేసీ వేణుగోపాల్
హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల 2016లో మృతి చెందిన ఘటనపై గతంలో నిర్వహించిన దర్యాప్తులో అనేక వైరుధ్యాలున్నాయని.. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం ఆయన కుటుంబానికి న్యాయం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆదివారం తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్
-
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
-
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
-
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!
-
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా