Perni nani-JP nadda: ‘ఓ నడ్డా గారూ.. మీకు చేతనైతే విపక్షాలకు సమాధానం చెప్పండి’: పేర్ని నాని
వైకాపా ప్రభుత్వ పాలనపై భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తెలంగాణ మంత్రి హరీశ్రావు చేసిన విమర్శలపై ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.
అమరావతి: ‘‘మేం చూసిన ప్రభుత్వాల్లో అత్యంత అవినీతిమయమైంది వైకాపా పాలనే. రాష్ట్రంలో కుంభకోణాలకు విరామం లేదు. గనులు, ఇసుక, మద్యం, భూముల వ్యవహారాల్లో పెద్ద ఎత్తున కుంభకోణాలు, అవినీతి జరిగాయి. వైకాపా ప్రభుత్వం అవినీతి, డబ్బు సంపాదనపైనే దృష్టిసారించింది’ అని శ్రీకాళహస్తి సభలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన విమర్శలకు ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. దిల్లీ నుంచి ఏపీకి వచ్చి ఎవరో చెప్పిన మాటలను బట్టీ పట్టి మాట్లాడటం సరికాదన్నారు. ఒక పార్టీకి జాతీయ అధ్యక్షుడి హోదాలో ఉన్న వ్యక్తి బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్ని నాని వ్యాఖ్యానించారు.
‘‘మేం మిమ్మల్ని గట్టిగా ప్రశ్నిస్తున్నాం. చేతనైతే సమాధానం చెప్పండి. ఏపీలో జగన్ నాయకత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, అగ్రవర్గాల్లోని పేదల ఆర్థిక అభ్యున్నతి కోసం సరాసరి రూ.2,16,000 కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో వేశాం. ఇలా అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పని చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైకాపా ప్రభుత్వం మాత్రమే. భాజపా పాలిస్తోన్న రాష్ట్రాల్లో ఎక్కడైనా ఏపీ ఖర్చు చేసిన దాంట్లో సగమైనా కేటాయించారా?రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోయినా అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంది. పైసా లంచం ఇచ్చే అవసరం లేకుండా మెరుగైన పాలన అందిస్తున్నాం.
కర్ణాటకలో అవినీతికి పాల్పడిన ప్రభుత్వం ఏదో అక్కడి ప్రజలు గమనించారు కాబట్టే భాజపాకు బుద్ధి చెప్పారు. ఇవాళ ఏపీలో పరిస్థితి చూస్తుంటే.. బీజేపీ కాస్త టీజేపీగా మారినట్లు కనిపిస్తోంది. ఏది మాట్లాడినా ఆలోచించి మాట్లాడాలి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆంధ్రప్రదేశ్లో భాజపా ఒక్క స్థానంలో కూడా విజయం సాధించడం సాధ్యం కాదు. దిల్లీలో విపక్షాలు అనేక ఆరోపణలు చేస్తున్నాయి. పార్లమెంట్లో మోత మోగిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేస్తున్నాయి. ఓ నడ్డా గారూ.. మీకు చేతనైతే మీప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలపై విపక్షాలకు సమాధానం చెప్పండి’’ అని పేర్ని నాని ఘాటుగా వ్యాఖ్యానించారు.
హరీశ్రావు సర్టిఫికెట్ మాకవసరం లేదు..
ఏపీ నేతల మాటలు కోటలు దాటుతాయని, చేతలు మాత్రం తక్కువని మంత్రి హరీశ్రావు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఏపీకి చెందిన ఇద్దరు నేతల తీరు కారణంగా ఆ రాష్ట్రం ఇప్పుడు బోర్లా పడిందని ఎద్దేవా చేస్తూ మాట్లాడటంపై పేర్ని నాని స్పందించారు. ‘‘చేతలు తక్కువ అనే హరీశ్రావును కేసీఆర్ పక్కన పెట్టారు. ఇంకోసారి సీఎం జగన్ గురించి మాట్లాడితే సరైన సమాధానం చెబుతాం. హరీశ్రావు సర్టిఫికెట్ మా ప్రభుత్వానికి అవసరం లేదు’’ అని పేర్నినాని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు -
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం