ఏపీ పురపోరు: బరిలో అక్కాచెల్లెళ్లు
వారిద్దరు సోదరీమణులు. ఒకరికొకరు ఆప్యాయంగా ఉండాల్సిన వారిద్దరు పుర సమరంలో ప్రత్యర్థులుగా మారారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని 13వ వార్డులో అక్కాచెల్లెళ్ల పోటీ స్థానికంగా ఆసక్తి రేపుతోంది....
ఆత్మకూరు: వారిద్దరూ సోదరీమణులు. ఒకరికొకరు ఆప్యాయంగా ఉండాల్సిన వారిద్దరూ పుర సమరంలో ప్రత్యర్థులుగా మారారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని 13వ వార్డులో అక్కాచెల్లెళ్ల పోటీ స్థానికంగా ఆసక్తి రేపుతోంది. ఆత్మకూరులోని 13వ వార్డు ఎస్సీ మహిళకు కేటాయించారు. తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ కౌన్సిలర్ శ్రీకాంత్ నారాయణ తన తల్లి లక్ష్మిని బరిలో నిలిపారు. ఇదే వార్డులో అధికార వైకాపా తరఫున లక్ష్మి చెల్లెలు పోటీకి దిగారు. అక్క గృహిణి కాగా చెల్లెలు న్యాయవాదిగా పనిచేస్తున్నారు. సోదరీమణుల సమరంలో విజయం ఎవరిని వరిస్తుందోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘గతంలో నా కుమారుడు శ్రీకాంత్ నారాయణ 13వ వార్డుకు ఎన్నో సేవలు చేశాడు. ప్రజలకు లోన్లు, పింఛన్లు ఇప్పించాడు. రోడ్లు వేయించాడు. ఈ వార్డుకు మా అబ్బాయి సేవ చేసినట్లుగానే, నేను కూడా సేవ చేయాలని నిర్ణయించుకున్నా’ అని తెదేపా అభ్యర్థి లక్ష్మి తెలిపారు. ‘13వ వార్డులోని సమస్యలు పరిష్కరించి, వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని’ వైసీపీ అభ్యర్థి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!