గాంధేయ మార్గంలో పోరాడాలి: రఘురామ

నర్సాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. గరువారం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...

Published : 27 Aug 2020 14:01 IST

దిల్లీ: నర్సాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. గరువారం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కళ్లుండి మనసులేని ప్రభుత్వాలు చేస్తున్న అన్యాయాలను కళ్లు లేని మనసున్న న్యాయస్థానాలు న్యాయం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. గాంధేయమార్గంలో న్యాయంకోసం పోరాటం చేయాలని అమరావతి రైతులకు సూచించారు. 

అమరావతి రైతుల పక్షాన అన్యాయానికి వ్యతిరేకంగా  మహిళలు చక్కటి పోరాటం చేస్తున్నారని అభినందించారు. అన్యాయంపై అమరావతి రైతులు పాక్షికంగా విజయం సాధించారన్నారు. స్టేటస్‌ కో ఆర్డర్‌ ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో అతిథిగృహం నిర్మాణానికి పూనుకోవడం దుస్సాహసమేనని వ్యాఖ్యానించారు. కోర్టుల్లో 70కి పైగా మొట్టికాయలు పడినప్పుడు తప్పులు సరిదిద్దుకోవాల్సిన అవసరముందని  రఘురామకృష్ణరాజు అన్నారు. నీలం సంజీవరెడ్డి, ఎన్‌ జనార్థన్‌రెడ్డి హయాంలో కోర్టులు చిన్న కామెంట్‌ చేశాయని రాజీనామా చేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని