జల్లికట్టు వేడుకల్లో రాహుల్ గాంధీ!
తమిళనాడులో ప్రారంభమైన జల్లికట్టు వేడుకలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, నటుడు ఉదయనిధి స్టాలిన్ పాల్గొని ఆరంభ వేడుకలను వీక్షించారు.
చెన్నై: సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో జల్లికట్టు వేడుకలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు ప్రసిద్ధి చెందిన మధురైలోని అవనియపురంలో తొలుత ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, డీఎంకే నేత, నటుడు ఉదయనిధి స్టాలిన్ పాల్గొని ఆరంభ వేడుకలను వీక్షించారు. ఈ సంవత్సరం తమిళనాడులో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ జల్లికట్టు వేడుకల్లో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక కరోనా నేపథ్యంలో జల్లికట్టు నిర్వహణపై తమిళనాడు ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ముఖ్యంగా 150 మంది కంటే ఎక్కువ మంది పోటీలో పాల్గొనరాదని, వీక్షకుల సంఖ్య 50శాతానికి మించరాదని ప్రభుత్వం ఆదేశించింది. జల్లికట్టు వేడుకలకు రాహుల్ గాంధీ రావడంతో కాంగ్రెస్ రాష్ట్రనేతలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. రైతుల జీవితంలో భాగమైన బసవన్న వేడుకలకు రాహుల్ గాంధీ రావడం ఎంతో గర్వకారణమని తమిళనాడు పీసీసీ హర్షం వెలిబుచ్చింది. అయితే, ఈ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ ఎటువంటి ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోరని స్పష్టంచేసింది.
భాజపా విమర్శ
జల్లికట్టు వేడుకలపై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందంటూ భారతీయ జనతా పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. ఇదివరకు జల్లికట్టును వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ, జల్లికట్టును నిషేధిస్తామని గత ఎన్నికల మానిఫెస్టోలో పెట్టిన విషయాన్నీ గుర్తుచేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న సమయం(2011)లో జల్లికట్టును నిషేధించడాన్ని భాజపా నాయకులు ప్రస్తావిస్తున్నారు. కేవలం రాష్ట్రంలో ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతోనే రాహుల్ గాంధీ జల్లికట్టుకు హాజరయ్యారని దుయ్యబట్టారు. ఇదిలాఉంటే, మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత జల్లికట్టుపై కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి..
తమిళనాడులో ఉత్సాహంగా జల్లికట్టు
సంక్రాంతి వేళ.. సెలబ్రిటీలు ఏమన్నారంటే..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైఎస్ షర్మిలపై కేసు నమోదు
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila)పై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి వివేకా హత్య కేసును ప్రస్తావించినందుకు ఆమెపై వైఎస్సార్ జిల్లా బద్వేలు పోలీసులు కేసు నమోదు చేశారు. -
కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. -
‘క్రిటికల్ రివర్’ కంపెనీ వెనుక ఐటీ సలహాదారు శేషిరెడ్డి
క్రిటికల్ రివర్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ వెనక వైకాపావారు, ఐటీ సలహాదారు పాటూరి శేషిరెడ్డి ఉన్నారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ఆరోపించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తొలుత రూపొందించింది జగన్ ప్రభుత్వమే
దేశంలో తొలిసారిగా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రూపొందించిందే జగన్ ప్రభుత్వం అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన బిల్లును కేంద్రం తిప్పి పంపినా మూడు సార్లు ఆమోదం కోసం పంపారని గుర్తుచేశారు. -
సీఎస్ను వెంటనే బదిలీ చేయాలి: రఘురామ
రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగాలంటే సీఎస్నూ వెంటనే బదిలీ చేయాలని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు డిమాండు చేశారు. -
రాముడిని ఆరాధించానని దాడి చేశారు
కాంగ్రెస్ను వీడిన రాధికా ఖేడా ఆ పార్టీ ఛత్తీస్గఢ్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాముడి భక్తురాలిని అయినందుకే తనపై దాడి చేశారని సోమవారం ఆమె మీడియాకు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
హరియాణాలో భాజపా సర్కార్కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి