Jammu Kashmir: ప్రేమని కోరితే.. బుల్డోజర్లు వచ్చాయి: రాహుల్ గాంధీ
జమ్ముకశ్మీర్లో ప్రభుత్వం చేపట్టిన యాంటీ ఎంక్రోచ్మెంట్ డ్రైవ్పై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రజలు కష్టపడి నిర్మించుకున్న ఇళ్లను ప్రభుత్వం కూల్చేస్తోందని మండిపడ్డారు.
దిల్లీ: జమ్ముకశ్మీర్(jammu kashmir)లో ఆక్రమణల తొలగింపు కోసం నిర్వహిస్తోన్న ప్రత్యేక డ్రైవ్ను ప్రధాన పార్టీలన్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ విషయంపైనే కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ(rahul gandhi) ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ఎన్నో ఏళ్లుగా కష్టపడి నిర్మించుకున్న కశ్మీరీల ఇళ్లను భాజపా లాగేసుకుంటోందన్నారు.
‘‘జమ్ముకశ్మీర్ ప్రజలు ఉద్యోగావకాశాలను, వ్యాపారాభివృద్ధిని, ప్రేమను కోరుకుంటున్నారు. కానీ, వారి వద్దకు భాజపా బుల్డోజర్లు వస్తున్నాయి. ఇక స్థలాల విషయానికొస్తే.. ప్రజలు దశబ్దాలపాటు కష్టపడి ఇళ్లు నిర్మించుకొని జీవిస్తున్నారు. ఇప్పుడు వాటిని భాజపా దోచుకుంటోంది’’అని విమర్శించారు. విభజించడం ద్వారా కాదు.. కలిసికట్టుగా ఉన్నప్పుడే కశ్మీరీలకు రక్షణ లభిస్తుందని, శాంతి నెలకొంటుందని చెప్పారు.
జమ్ముకశ్మీర్లోని ఆక్రమణలను స్వాధీనం చేసుకోవాలన్న రెవెన్యూశాఖ ఆదేశాల మేరకు అధికారులు యాంటీ ఎంక్రోచ్మెంట్ డ్రైవ్ (anti-encroachment drive) చేపట్టారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు అధికారులు 10 లక్షల కనాల్స్ భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రైవ్ను నిలిపివేయాలని కోరుతూ గత నెలలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. కానీ, స్టే విధించేందుకు కోర్టు అంగీకరించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్