NDA: ఎన్డీఏ ‘మహా’ వ్యూహం.. ఉద్ధవ్కు చెక్ పెట్టేందుకు రంగంలోకి రాజ్..!
మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి వేగంగా పావులు కదుపుతోంది. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది.
ఇంటర్నెట్డెస్క్: శివసేన ఉద్ధవ్ వర్గం భారీ సంఖ్యలో ఓట్లను చీల్చకుండా ఎన్డీఏ కూటమి వ్యూహానికి మరింత పదును పెట్టింది. వీలైనన్ని పార్టీలను కూటమిలో చేర్చుకొని మహారాష్ట్రలో అత్యధిక పార్లమెంట్ స్థానాలను సాధించాలని చూస్తోంది. ఉద్ధవ్ సోదరుడు, మహారాష్ట్ర నవ్నిర్మాణ్ సేన అధినేత రాజ్ ఠాక్రేను తమ జట్టులో చేర్చుకొనేందుకు ఎన్డీఏ పావులు కదుపుతోంది. దీనిలో భాగంగానే రాజ్ తన కుమారుడుతో కలిసి దిల్లీలో భాజపా అగ్రనాయకుడు అమిత్షాతో భేటీ అయ్యారు. ఈ పరిణామాలతో లోక్సభ ఎన్నికల వేళ కూటమిలో చేరడం ఖాయమనే ప్రచారం జోరందుకొంది.
సోమవారం రాత్రే రాజ్ తన కుమారుడితో కలిసి దిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘దేశ రాజధానికి రమ్మని పిలిచారు. వచ్చాను.. చూద్దాం ఏం జరుగుతుందో’’ అని విలేకర్ల వద్ద వ్యాఖ్యానించారు. అప్పటికే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాంకులే దిల్లీలోనే ఉన్నారు. పొత్తులో భాగంగా ఎంఎన్సీ వర్గం దక్షిణ ముంబయి, శిరిడీ లోక్సభ సీట్లను డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
పరస్పర అవసరాలే కలిపాయా..
2019 లోక్సభ ఎన్నికల్లో భాజపా-శివసేన కూటమి మహారాష్ట్రలో పోటీ చేసింది. నాడు మొత్తం 48 సీట్లలో 41 సాధించింది. కొన్ని నెలల తర్వాత జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో కూడా ఈ కూటమి విజయం సాధించింది. అధికారం పంచుకొనే విషయంలో ఇరు పక్షాల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో శివసేన ఎన్డీఏను వీడి మహా వికాస్ అఘాడీ(కాంగ్రెస్-ఎన్సీపీ)తో జట్టుకట్టింది. కొంతకాలం ప్రభుత్వం సజావుగా సాగినా.. 2022లో శివసేన సీనియర్ నేత ఏక్నాథ్ శిందే నేతృత్వంలోని వర్గం తిరుగుబాటు ప్రకటించింది. వీరు భాజపాతో చేతులు కలిపారు. దీంతో రాష్ట్రంలో అధికారం ఎన్డీఏ వశమైంది. ఆ తర్వాత పార్టీ, గుర్తును ఉద్ధవ్ వర్గం కోల్పోయింది. ఈ సమయంలో రాజ్, శిందే వర్గానికి మద్దతుగా నిలిచారు. ఉద్ధవ్ కారణంగానే పార్టీ చీలిపోయిందని ఆరోపించారు. ఇక మరోవైపు ఎన్సీపీలో కూడా అజిత్ పవార్ నేతృత్వంలో తిరుగుబాటు చోటు చేసుకొంది. అత్యధిక మంది ఎన్డీఏతో జట్టుకట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్ధవ్ వర్గానికి సానుభూతి లభిస్తే ప్రతికూలంగా మారుతుందని భాజపా అంచనావేస్తోంది. పెద్ద రాష్ట్రం కావడంతో ఏ మాత్రం రిస్క్ చేయడానికి ఇష్టపడటంలేదు. ఠాక్రే కుటుంబంలోని మరో ప్రజాకర్షక నేత రాజ్ను తమ పక్షాన చేర్చుకొనేందుకు పావులు కదిపింది.
బాల్ ఠాక్రేకు స్వయాన సోదరుడి కుమారుడే రాజ్. ఆయన ఉద్ధవ్తో విభేదాల కారణంగా 2006లో శివసేన నుంచి బయటకు వెళ్లిపోయారు. 2009లో అతడి నేతృత్వంలోని ఎంఎన్సీ 13 ఎమ్మెల్యే స్థానాలను సాధించింది. కానీ, 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తీవ్రంగా దెబ్బతింది. ఇప్పుడు ఆ పార్టీ తిరిగి బలపడాలంటే ఓ పెద్ద అండ అవసరం. భాజపా రూపంలో అది లభిస్తుందని రాజ్ ఆశిస్తున్నారు. సీట్ల పంపిణీ ఓ కొలిక్కి వచ్చి ఎన్డీఏలో చేరితే ఎంఎన్సీకి పుంజుకోవడానికి అవకాశం లభించినట్లే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. -
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు -
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి